ఆలేరురూరల్/ రామన్నపేట/మోత్కూరు సెప్టెంబర్ 15 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగరి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సమక్షంలో శర్భనాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి ఆమె ఆహ్వానించారు. బొడ విజ య్, సూదగాని పరశురాములు, భిక్షపతి, క్రాంతితోపాటు మరో 30మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీఏ సీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, మాజీ ఎంపీపీ కాసగల్ల అనసూయ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అంగడి భిక్షపతి పాల్గొన్నారు. రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడ్డు అల్లయ్యతోపాటు బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 300మంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు తమ ఉనికిని కాపాడు కోవడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్పప్రచారాలను చేస్తున్నారని , వాటిని ప్రజలు నమ్మరన్నారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలాధ్యక్షుడు నంధ్యాల భిక్షంరెడ్డి, కార్యదర్శి ఖమ్మంపాటి శ్రీనివాస్, ఎంపీటీసీలు జి నర్సింహ, ఎండీ రేహన్, ఎండీ అమీర్, నాయకులు బందెల రాములు, పున్న జగన్మోహన్, నీల దయాకర్, గుత్తా నర్సిరెడ్డి, కన్నెబోయిన బలరామ్, మందడి ఉదయ్రెడ్డి, పృథ్వీరాజ్, మాధవ రెడ్డి, లింగం, కిషన్, సంతోష్ పాల్గొన్నారు. మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు లోతుకుంట యాదగిరి, వడ్డేపల్లి లక్ష్మి పరశురాములు, పాటి లింగయ్య తుంగతుర్తి ఎమ్మెల్యేకిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, సర్పంచు బత్తిని తిరుమలేశ్, మాజీ సర్పంచ్ బత్తిని హన్మంతు, వార్డు సభ్యులు పైళ్ల రమేశ్, పొన్నె బోయిన అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో..
తుంగతుర్తి/ హుజూర్నగర్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎంపీటీసీ-2 ఇరుగు సృజనా సుధాకర్ బీజేపీకి రాజీనామా చేసి 100 మందితో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించి మాట్లాడారు. దళితబంధును ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, తాటికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు, గోపగాని శ్రీనివాస్గౌడ్, డాక్టర్ వై.ఎన్.చారి, దొంగరి శ్రీను, తునికి సాయిలు, టీఆర్ఎస్లో చేరిన వారిలో బొంకూరి వెంకన్న, శ్రీకాంత్, మధు, సాయికుమార్, శివకుమార్ ఉన్నారు. హుజూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ నీటి సంఘం చైర్మన్ ఇస్మాయిల్, మాజీ ఉపాధ్యక్షులు మౌలాలి, మాజీ చైర్మన్ జాను, రాజీ, హుస్సేన్, మహ్మద్ మరో 50 మంది కార్యకర్తలు ఉన్నారు.
నల్లగొండ జిల్లాలో..
కేతేపల్లి : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన నారగోని మల్లయ్య, చిలుముల రాములు, కానుగు అంజయ్య ఆధ్వర్యంలో 100 మంది గ్రామస్తులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే వారిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముల వెంకన్నయాదవ్, సర్పంచులు బి.శ్రీనివాస్యాదవ్, కోట వెంకటేశ్వరరావు, చింతమళ్ల అశ్విని, బచ్చు జానకి రాములు, కట్టా శ్రవణ్కుమార్, నాయకులు కె.ప్రదీప్రెడ్డి, బంటు మహేందర్, వి.చేతన్, జి.సత్యనారాయణగౌడ్, గోలి వేణుమాధవరెడ్డి, ఎస్.వెంకట్రెడ్డి, పాల్గొన్నారు.