కరోనా బాధితులకు అండగా సర్కారు
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం
నిరంతరం అందుబాటులో వైద్యులు
భయం వీడి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలి
మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
భువనగిరి కలెక్టరేట్,మే 15: కరోనా బారిన పడ్డ బాధితులు అధైర్య పడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, దవాఖానల్లో అన్ని వసతులను కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నదని భువనగిరి మాజీ పార్ల మెంటు సభ్యుడు డా క్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యా లయంలో కలెక్టర్ అనితారామచంద్రన్తో కలిసి సమీక్ష నిర్వహించారు. బాధితులకు అండగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపా యాలు ఉన్నాయని బాధితులు ప్రభుత్వ వైద్య సే వలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావే శంలో మున్సిపల్ చైర్మన్ అంజనేయులు,మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, ఎంపీపీలు సుధాకర్ గౌడ్, నిర్మల ఎయి మ్స్కొవిడ్ కేర్ ఇన్చార్జి డాక్టర్ కల్యాణి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివ రా వు తదితరులు పాల్గొన్నారు.
ఎయిమ్స్లో పూర్తి స్థాయి కొవిడ్సేవలకు కృషి
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ దవాఖానలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తానని మాజీ పార్ల మెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శని వారం మండల పరిధిలోని ఎయిమ్స్ దవాఖా నను సం దర్శించి డైరెక్టర్ వికాస్ భాటియా, సూపరింటెండెంట్ డాక్టర్ కల్యాణితో సమావేశం నిర్వ హించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దవాఖానలో వైద్య సేవలు అందించడా నికి 80మంది సూపర్ స్పెషాల్టీ డాక్టర్లు ఉన్నార ని ఎలాంటి సిబ్బంది కొరత లేదన్నారు. బీబీ నగర్ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్ వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్లు అందించనున్నా రన్నారు. దవాఖానలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రెండు కంపెనీలు ముం దుకు వచ్చాయన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్స్, కాన్స ట్రేటర్లతో పాటు, నెలరోజుల్లో 100 పడ కల నుం చి 200పడకల ఆక్సిజన్ బెడ్లు, 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.