నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రంజాన్ పర్వదినాన్ని జిల్లాలో ముస్లిం సోదరులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిరాడంబరంగా జరుపుకొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులపాటు చేపట్టిన ఉపవాస దీక్షలు గురువారం సాయంత్రం ముగిశాయి. కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో ఈద్గా, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించకూడదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శుక్రవారం ఉదయం ముస్లిం సోదరులు తమ తమ ఇండ్లలోనే ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు చేసి ఇండ్ల వద్దనే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా, మసీదుల్లో మత పెద్దలకు మాత్రమే అనుమతిచ్చారు.
వలిగొండ, మే 14: రంజాన్ పర్వదినాన్ని శుక్రవారం ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఇండ్లలోనే జరుపుకొన్నారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో ముస్లింలు మసీదులకు వెళ్లకుండా ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
బీబీనగర్, మే 14 : మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిరాడంబరంగా ఇండ్లలోనే జరుపుకొన్నారు.
భువనగిరి అర్బన్, మే 14: రంజాన్ పండుగను భువనగిరి పట్టణం, మండలంలోని గ్రామాల్లో ముస్లిం సోదరులు ఇం ట్లోనే ఉండి ప్రార్థనలు చేసి నిరాడంబరంగా జరుపుకొన్నారు. ముస్లిం మత పెద్దలు ఈద్గాల వద్ద భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా సమీపంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు పట్టణ సీఐ సుధాకర్, ఎస్ఐ అంజయ్య రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్చైర్మన్ చింతల కిష్టయ్యలతోపాటు పలువురు నాయకులు ఫోన్లో ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్ష లు తెలియజేశారు. మండలంలోని బీఎన్.తిమ్మాపురం గ్రామంలోని ముస్లింలకు భువనగిరి పీఏసీఎస్ మాజీ చైర్మన్ సత్తిరెడ్డి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని తాజ్ పూర్, రాయగిరిలో గల ఈద్గాల వద్ద మత పెద్దలు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని రూరల్ ఎస్ఐ సైదులు తెలిపారు. అనంతరం ఆయన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాల వద్ద ముస్లింలు భౌతికదూరం పాటిస్తూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
యాదాద్రి, మే14: రంజాన్ వేడుకను ముస్లిం సోదరులు ఎలాంటి ఆర్భాటం లేకుండా ఇండ్లలోనే జరుపుకొన్నారు. కేవలం ఐదుగురు మత పెద్దలు మాత్రమే మసీద్లోకి వెళ్లి ప్రార్థనలు చేశారు. పలువురు ముస్లిం యువతి, యువతులు, చిన్నారులు ఒక్కరికొక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
ఆత్మకూరు(ఎం), మే 14: రంజాన్ వేడుకను మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ముస్లింలు సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండీ.అజీమొద్దిన్, జమాల్, అక్బర్, అన్వర్, కరీమ్, ఉస్మాన్, అఫ్జల్ పాల్గొన్నారు.
చౌటుప్పల్, మే14: మున్సిపాలిటీలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు నిరాడంబరంగా జరుపుకొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ప్రార్థనలు చేశారు. మసీద్, దర్గాల్లో నలుగురు మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి.
మోత్కూరు, మే 14: మోత్కూరు, గుండాల మండలాల్లోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వ దినాన్ని జరుపుకొన్నారు. గుండాల మండల కేంద్రంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్ పండుగ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మోత్కూరులో జరిగిన కార్యక్రమంలో జామ్ మసీద్ సదర్ ఎండీ మజీద్ మసీదులో ప్రార్థనలు చేశారు.
n భూదాన్పోచంపల్లి, మే 14 : మండలంలో రంజాన్ వేడు కను ముస్లిం సోదరులు నిరాడంబరంగా జరుపుకొన్నారు. పోచంపల్లి పట్టణంలోని మదీనా మసీదులో ముస్లింలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఇమా మ్ ముఫ్తీ అబ్దుల్ సమద్, కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అజ్గర్, ఎండీ జహంగీర్, ఎంఏ షరీఫ్, ఆరిఫుల్లా పాల్గొన్నారు.
n అడ్డగూడూరు,మే 14: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రా మాల్లో ముస్లిం సోదరులు శుక్రవారం రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఎవరి ఇండ్లలో వారు నిరాడంబరంగా జరుపుకొన్నారు.