నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మూడోరోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఉదయం 10గంటల తర్వా త వాహనాలు, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సమయంలోనే ప్రజలు బయటకు వచ్చి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి గడువు ముగిసేలోపు స్వచ్ఛందంగా ఇండ్లకు చేరుకుని నిబంధనలను పాటించారు. 20 గంటలపాటు ప్రజలు ఇండ్లలోనే ఉంటూ లాక్డౌన్ కు సహకరిస్తున్నారు. వ్యాపారులు కూడా 10 గంటలలోపే తమ వర్తక, వ్యా పారాలను మూసివేశారు.
మోటకొండూర్, మే14: మండలంలో లాక్డౌన్ మూడోరోజు సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచే ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు షాపులకు తరలివెళ్లారు. వ్యాపారులు 10 గంటల లోపే దుకాణాలను మూసివేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పటికప్పుడు లాక్డౌన్ అమలు తీరును పోలీసులు పర్యవేక్షించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి లాక్డౌన్పై అవగాహన కల్పించారు.
తుర్కపల్లి, మే 14 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో లాక్డౌన్ మూడోరోజు ప్రశాంతంగా కొనసాగింది. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్ఐ మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు చెక్పోస్టు ఏర్పా టు చేసి 24 గంటలు పహారా కాస్తున్నారు. ఉదయం 10 గంటల లోపే వ్యాపార , వాణిజ్య సముదాయాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు.
రాజాపేట, మే 14 : మండలంలో లాక్డౌన్ మూడోరోజు ప్రశాంతంగా జరిగిం ది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు షాపులను తెరిచిన వ్యాపారులు 10 గంటలకు మూసి వేశారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో జన సంచారం లేక వీధులు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతుందని ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపారు.
ఆత్మకూరు(ఎం), మే 14: కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూడో రోజైన శుక్రవారం మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు ఉదయం 10 గంటల లోపు షాపులను మూసి లాక్డౌన్కు సహకరించారు. దీంతో ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అడ్డగూడూరు, మే 14: మండలంలో మూడోరోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొ నసాగింది. పోలీసులు పెట్రోలింగ్ వాహనాలతో లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షిం చారు. మండలంలోని చిర్రగూడూరు స్టేజీ వద్ద వాహనాలను ఎస్ఐ మహేశ్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
వాహనదారులపై కేసుల నమోదు
మండల పరిధిలో ఉదయం 10 గంటల త ర్వాత లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై సంచరించిన 23 మంది వాహన దారులపై శుక్రవారం కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ముని తెలిపారు.