భువనగిరి అర్బన్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబ్కేదర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో అంబేద్కర్ చిత్రపటానికి ఆమె నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, కీమ్యానాయక్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్యామ్సుందర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ
భువనగిరి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామా ల్లో అంబేద్కర్ జయంతిని ప్రజా ప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, ఎంపీపీ నిర్మల, మున్సిపల్ కమిషనర్ ఎం.పూర్ణచందర్, నాయకుడు అంజయ్య పట్టణంలోని వినాయకచౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అనంతారం సర్పంచ్ మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
వలిగొండలో…
వలిగొండ, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని మండలంలోని వివిధ గ్రామాల్లో జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనర్సింహ, స్థానిక సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి మామిండ్ల రత్నయ్య, రాపోలు పవన్కుమార్, సంగిశెట్టి క్రిష్టోఫర్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, ఎంపీడీవో గీతారెడ్డి, ఎంపీవో కేదారీశ్వర్, గ్రంథాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ, ఎమ్మార్పీఎస్ నాయకులు కందుల అంజయ్య, నానచర్ల రమేశ్, దుబ్బ దానయ్య, ఎల్లంకి స్వామి, బుంగ సునీల్, బర్ల నాగార్జున పాల్గొన్నారు.
రామన్నపేటలో….
రామన్నపేట, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతిబలరామ్, పీఏసీఎస్ చైర్మన్ భిక్షంరెడ్డి, సర్పంచ్లు శిరీష, గుత్తా నరర్సింహారెడ్డి, రేఖాయాదయ్య, ఎంపీటీసీలు నర్సింహ్మ, రేహాన్, నాయకులు బందెల రాములు, నీల దయాకర్, మొగలయ్య, బొడ్డు సురేందర్, పోతరాజు సాయికుమార్, బొడ్డు శంకరయ్య, గురుకు శివ, జాడ సంతోష్, ఆముద లక్ష్మణ్ పాల్గొన్నారు.
బీబీనగర్లో..
మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పింగల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, బొక్క జైపాల్రెడ్డి, మల్లగారి శ్రీనివాస్, ఎస్సై రాఘవేందర్, మంచాల రవి, మంచాల నరహరి, పొట్ట వెంకటేశ్, బాలు, జక్కి నగేశ్ పాల్గొన్నారు
భూదాన్పోచంపల్లిలో…
భూదాన్పోచంపల్లి, ఏప్రిల్ 14: ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల పరిధిలోని జూలూరు, జిబ్లక్పల్లి, దేశ్ముఖి గ్రామాల్లో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు.
చౌటుప్పల్లో..
చౌటుప్పల్ ఏప్రిల్14: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
సంస్థాన్నారాయణపురంలో
సంస్థాన్నారాయణపురం, ఏప్రిల్ 14: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ గుత్తా ఉమాదేవి,జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, ఈసం యాదయ్య, నర్రి పావని, సర్పంచ్ శ్రీహరి పాల్గొన్నారు.
మోత్కూరులో…
మోత్కూరు,ఏప్రిల్ 14 : భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ నాయకులు ఉప్పలయ్య, మైసయ్య పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో….
అంబేద్కర్ జయంతిని మండలంలోని దాచారం, దత్తప్పగూడెం, కొండగడప గ్రామాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.