యాదాద్రి, ఏప్రిల్ 14: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో బుధవారం నిత్యోత్సవాలు అత్యంత వైభ వంగా జరిగాయి. వేకువజామునకే స్వయంభులకు, బాలా లయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండ పంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహుల ను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన నారసిం హ హోమం అనంతరం నిత్య తిరుకల్యాణ వేడుకలు ఆగ మశాస్త్ర రీతితో నిర్వహించారు. స్వామివారి అలంకార సేవో త్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిరోజూ ఒక్కో రకమైన పూజలతో లక్ష్మీ నృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం అలంకార జో డు సేవలు, మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చరమూర్తులు కొ లువైన బాల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదా యంగా జరిగాయి. సీతారామచంద్రుడికి రామ మానస పూజ, ప్రాతఃకాల మధ్యాహ్నా పూజలు, శివపార్వతులను అరాధిస్తూ అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు.
ఖజానాకు రూ. 4,60,771 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ. 4,60,771 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.40,204, రూ.100 దర్శనాలతో రూ. 16,300, నిత్య కైంకర్యాలతో రూ. 2,200, సుప్రభాతం ద్వారా రూ.700, ప్రచారశాఖద్వారా రూ. 900, క్యారీ బ్యా గులతో రూ. 2,100, వ్రతాలతో రూ. 29,000, కల్యాణ కట్టతో రూ.14,000, ప్రసాద విక్రయాలతో రూ. 2,24, 800, శాశ్వత పూజలతో రూ. 6,000, వాహన పూజలతో రూ. 8,100, టోల్గేట్ ద్వారా రూ. 860, అన్నదాన విరా ళంతో రూ. 3,837, సువర్ణ పుష్పార్చనతో రూ. 39,000, యాదరుషి నిలయంతో రూ. 33,280, పాత గుట్టతో రూ. 9,490, టెంకాయల విక్రయాలతో రూ. 30,000తో కలిపి స్వామి వారికి రూ. 4,60,771 ఆదా యం సమకూరింది.