ఆలేరు టౌన్, ఏప్రిల్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందుకు గాను రైతులకు రాయితీ అందజేస్తున్నది. ఏటా వాణిజ్య పంటలను సాగు చేసే రైతుల ను ఉద్యాన పంటల సాగు వైపు దృష్టి సారించేలా ప్రభుత్వం వారికి తగిన ప్రోత్సాహకాన్ని కల్పిస్తుంది. ఉద్యాన రైతులకు రాయితీపై డ్రిప్ పరికరాలను అం దజేస్తున్నది. తక్కువ నీటితో అధిక పంటలను పం డించేందుకు బిందు సేద్యం ఉపయోగకరంగా ఉం టుంది. నీటిని పొదుపుగా వాడుకుంటూ సాగు చేప ట్టే రైతుల కోసం ప్రభుత్వం బిందు సేద్య పరికరా లను మంజూరు చేస్తుంది. 2020-2021 ఆర్థిక సం వత్సరానికి జిల్లాలో పలువురు రైతుల నుంచి దర ఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 85 మంది లబ్ధి దారులు దరఖాస్తులు అందజేసి డీడీలు కట్టారు. ఇందులో బీసీ-25, ఎస్టీ-14, ఎస్సీ-6, ఓసీ-36, మైనారిటీ-4 మంది ఉన్నారు.
జిల్లాలో సాగు ఇలా
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభు త్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 18,998 ఎకరాల్లో పండ్ల తోటలు, కూరగాయల సాగు అవుతుంది. సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం రైతు లకు అవగాహన కల్పిస్తుంది. ఇందులో భాగంగా రైతుకు 5 హె క్టార్ల వరకు బిందు పరికరాలను రాయితీపై అందుకునే వీలుం ది. ఎస్టీ,ఎస్సీ రైతులకు 100 శా తం రాయితీతో, బీసీ రైతులకు 90 శాతం రాయితీతో, ఇతర కులాలకు చెందిన రై తులకు 80 శాతం రాయితీతో అందజే స్తుంది. బిందు సేద్యం పద్ధతిలో సాగు చే సే రైతులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సం బంధిత అధికారులు పరిశీలించి పరికరాలు మంజూరు చేస్తారు
దు సేద్యంతో లాభాలు ఇలా
తేలికైన ఇసుక, నల్లరేగడు భూముల్లో లోతు తక్కువ, ఎత్తు ప ల్లాలు ఉండే ప్రాంతాల్లో ఈ విధానం అనువైంది. ప్రతి మొక్కకు నీరు ఒకే మోతాదులో అంది అవి ఏపుగా పెరుగుతాయి. సు మారు 30 నుంచి 40 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్క వేర్లకు దగ్గరగా అందించడంతో 40 నుంచి 50 శాతం ఎరువులు ఆదా అవుతా యి. కలుపు తొలగించే ఖర్చు 60 శాతం తగ్గుతుంది. వేసవిలో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయొచ్చు. బిందు సేద్యం భూ సారాన్ని కా పాడుతుంది. భూమి కోతకు గురికాదు. చీడ పీడల సమస్య తక్కువగా ఉంటుంది