ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మాకొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా టీచర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2005 సంవత్సరం నుంచి స్కూళ్లకు డుమ్మా కొడుతున్న టీచర్లకు సంబంధించిన వివరాలను జిల్లాల వారీగా సేకరిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు డీఈవోలు లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తవ్వగా..25 మంది ఉన్నట్లు గుర్తించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మూడు రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలతో నివేదికను రూపొందించే పనిలో ఆయా జిల్లాల అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులైన టీచర్లపై సీసీఏ రూల్స్, లీవ్రూల్స్ అండ్
ఫండమెంటల్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.
భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే బాధ్యతను మరుస్తున్నారు. సక్రమ మార్గాన నడిపించాల్సిందిపోయి వారే తప్పటడుగులు వేస్తున్నారు. ఎటువంటి సెలవులు పెట్టకుండా..ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మాకొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా టీచర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2005 సంవత్సరం నుంచి స్కూళ్లకు డుమ్మా కొడుతున్న టీచర్లకు సంబంధించిన వివరాలను జిల్లాల వారీగా సేకరిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు డీఈవోలు లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తవ్వగా..25 మంది ఉన్నట్లు గుర్తించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మూడు రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలతో నివేదికను రూపొదించే పనిలో ఆయా జిల్లాల అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులైన టీచర్లపై సీసీఏ రూల్స్, లీవ్రూల్స్ అండ్ ఫండమెంటల్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. తాజాగా..చేపడుతున్న చర్యలు డుమ్మా టీచర్లలో దడ పుట్టిస్తున్నాయి.”ఏండ్ల తరబడి బడులకు హాజరుకాని టీచర్లపై వేటుకు రంగం సిద్ధమైంది. సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్న టీచర్ల విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టింది. 2005 జనవరి 1వతేదీ నుంచి 2021 జూలై వరకు విధులకు హాజరుకాని టీచర్ల వివరాలు సేకరించాలని డీఈవోలు, ఆర్జేడీలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు మండలాల వారీగా ఎంఈవోల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోనే ఒక దఫా డుమ్మా టీచర్లపై వివరాలను సేకరించగా..ఈ తరహాలో ఇంకా ఎంతమంది ఉంటారో? లెక్క తేల్చేందుకుగాను మరోసారి పాఠశాలల వారీగా ఆరాతీసి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పక్కాగా నివేదికలు ఇచ్చే పనిలో డీఈవోలు నిమగ్నమయ్యారు.
చాలా వరకు టీచర్లు అకారణంగా..ఎటువంటి సెలవులు పెట్టకుండా విధులకు డుమ్మా కొడుతున్నారు. వీరిలో చాలా మంది ప్రైవేట్ వ్యాపారాలు, వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వహణతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫైనాన్స్, ఇతరత్రా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొందరు సరైన కారణాలు చెప్పకపోవడం, ఇంతకంటే ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగం దొరకడం వంటి కారణాలతో సమాచారం ఇవ్వడం లేదు. ఇలా అనేక కారణాలతో ఉపాధ్యాయులు పాఠశాలలకు దీర్ఘకాలికంగా గైర్హాజరవుతున్నారు. వీరి వ్యవహారాలను ఇన్నాళ్లు చూసీ చూడనట్లుగా వదిలేసిన సంబంధిత ఎంఈవోలు, హెచ్ఎంలు తాజా..ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. జిల్లాలో 712 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా..వీటిల్లో 2,869 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన విచారణలో దీర్ఘకాలిక సెలవులపై వెళ్లినవారు జిల్లావ్యాప్తంగా 25 మంది వరకు ఉన్నట్లు తేలింది. వారిపై డీఈవో స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. సంబంధిత నివేదికను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు నివేదించినట్లు డీఈవో చైతన్యజైని తెలిపా రు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో గత మూడు రోజుల క్రితమే డుమ్మా టీచర్ల జాబితాను తేల్చే ప్రక్రియ మొదలైంది. మరో పది రోజుల్లో ఈ రెండు జిల్లాల్లోనూ విధులకు డుమ్మా కొడుతున్నవారి లెక్క తేలనున్నది.
ఉపాధ్యాయులు సెలవులపై వెళ్లేటప్పుడు నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విదేశాలకు వెళ్లేవారికి ఆరునెలల పాటు అనుమతి ఉంటుంది. ఆరు నెలల వరకు సెలవులను విద్యాశాఖ పాఠశాల సంచాలకుడు నుంచి తీసుకోవాలి. టీచర్లు ఏడాదిపాటు గైర్హాజరైతే రాజీనామా చేసినట్టే లెక్క. దీర్ఘకాలిక సెలవు పెట్టాలంటే ప్రత్యేక కారణాలు ఉండాలి. ఒకవేళ అనారోగ్యంతో మెడికల్ లీవ్ పెట్టదలిస్తే ఆ ఉపాధ్యాయుడి స్థానంలో మరో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని నియమించాలి. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ఆమోదం పొందాలి. అయితే చాలామంది ఉపాధ్యాయులు మెడికల్ లీవ్తోనే సరిపెట్టి ఇతరత్రా అనుమతులు తీసుకోకుండానే ఏండ్లతరబడి స్కూళ్లకు డుమ్మా కొడుతున్నారు. వారి స్థానాల్లో ప్రత్యేకించి ఉపాధ్యాయులను కూడా నియమించకపోవడంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతోంది. ఏడాది వరకు విధులకు హాజరుకాని వారిని విద్యాశాఖ అధికారులు వెంటనే గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా..అనధికారికంగా విధులకు డుమ్మా కొట్టిన టీచర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించిన నేపథ్యంలో చర్యల నుంచి తప్పించేందుకు కొందరు పైరవీలకు తెరతీసినట్లుగా ప్రచారం జరుగుతోంది.