ఆలేరు టౌన్, మే 13 : ఆలేరు సీహెచ్సీలో 113 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 39 మందికి పాజిటివ్, అలాగే శారాజీపేట పీహెచ్సీలో 45 మందికి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
మోటకొండూర్ పీహెచ్సీలో 16 మందికి..
మోటకొండూర్, మే 13 : మండలంలోని పీహెచ్సీలో మండల కేంద్రంతోపాటు పలు మండలాలకు చెందిన 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 16 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్ గురువారం తెలిపారు.
బొమ్మలరామారంలో 22 మందికి..
బొమ్మలరామారం, మే 13 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 44మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 22 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి శ్రావణ్కుమార్ తెలిపారు.
రాజాపేటలో 14 మందికి..
రాజాపేట, మే 13 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 14 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు. కరోనా సోకిన వారికి హోం ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
వలిగొండ మండలంలో 71 మందికి..
వలిగొండ, మే 13 : వలిగొండ మండలంలో 71 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సుమన్కల్యాణ్, డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని వలిగొండ, వర్కట్పల్లి, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 208 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా, 71 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
మోత్కూరు, గుండాలలో 42మందికి..
మోత్కూరు, మే 13 : మోత్కూరు, గుండాలలో 42 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారులు తెలిపారు. మోత్కూరు పీహెచ్సీలో 103 మంది కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయించుకోగా, 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు. అదేవిధంగా గుండాలలో 50 మంది పరీక్షలు చేయించుకోగా, 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వం మంజూరు చేసిన కొవిడ్ కిట్లను బాధితులకు అందజేశామని తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో 21 మందికి..
ఆత్మకూరు(ఎం), మే 13 : కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన కొవిడ్ వ్యాక్సిన్ను మొదటి విడుతలో వేసుకున్న వారికి గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో రెండో విడుత 40 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు.
రామన్నేపేటలో 38 మందికి..
రామన్నేపేట, మే 13 : మండలంలో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రవికుమార్ గురువారం తెలిపారు.