రామన్నపేట, మే13: పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం ..30 రోజుల ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. గురువారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకోవాలని మతగురువులు నిర్ణయించారు. దీంతో ఈద్-ఉల్-ఫితర్ నిర్వహించుకొనుటకు మసీదులను ముస్తాబు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇండ్లల్లో ప్రార్థనలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు..
ఈద్-ఉల్- ఫితర్ అంటే..
నెలరోజులు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్ మాసపు మొదటిరోజు జరుపుకొనే పండుగే ఈద్- ఉల్-ఫితర్ అంటారు. నమాజు చేసిన అనంతరం ఇష్రాఖ్ సమయం ప్రారంభమైన తర్వాత ఈద్-ఉల్-ఫితర్ రెండు రకాలుగా నమాజు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఈద్-ముబారక్ అం టూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్యను పాటిస్తారు. తామంతా ఒకే భావన, ప్రేమాభిమానాలను నెలకొల్పడంలో ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
ఫిత్రాదానం..
షవ్వాల్ మాసపు మొదటిరోజు ఈద్-ఉల్-ఫితర్ పం డుగ నాడు నమాజు ప్రార్థనలకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా.. అందుకే ఈ పండుగకు ఈద్-ఉల్-ఫితర్ అని పేరు వచ్చింది. షరియత్ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉం టాయి. ఆ లోపాల పరమార్థం చేసేదే ఫిత్రాదానం.. సమాజంలోని నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఈ దానం చేస్తారు. పావు తక్కువ రెండు కిలోల గోధుమల తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దానం చేయాలి. ఈద్ నమాజ్ కోసం ఈద్గాకు వెళ్లేటప్పుడు అల్లాహ్అక్బర్- అల్లాహ్అక్బర్, లాయిలాహ ఇల్లాలాహు వల్లాహుఅక్బర్, అల్లాహు అక్బర్ విలిల్లాహిల్ హమ్ద్ అనే తక్బీర్ను పఠించాలి. అం తేగా కుండా ఈద్గాకు వెళ్లేటప్పుడు కాలి నడకన ఒక దారిన వెళ్లి, వచ్చేటప్పుడు మరో దారిలో రావడం ఉత్తమం.
ఈద్-ఉల్- ఫితర్ నమాజు ప్రత్యేకం..
ఈద్-ఉల్-ఫితర్ నమాజు కోసం ఈద్గాలు. మసీదులను ముస్తాబు చేశారు.. ఫజర్ నమాజ్ అనంతరం ఇష్రాఖ్ నమాజ్ సమయం ప్రారంభమైన తర్వాత ఈ నమాజ్ చేస్తారు. నమాజ్ కోసం ఆజాన్, ఆఖామత్ చెప్పనవసరం లేదు.. ఈ నమాజుకు ముందు ఎలాంటి సున్నత్ నమాజులు చేయరాదు.. ఇమామ్లు ఈద్-ఉల్ -ఫితర్ గురించి ఉపదేశించి నియామాలు వివరిస్తారు. నమాజు అనంతరం ఖుద్బాను పఠిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
జిల్లాలోని ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు..రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతోనే ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీనికి అనుగుణంగా పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలి. డబుల్ మాస్కులు ధరించాలి. మసీదుల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించి శానిటైజర్లు వాడాలి..
-అనితారామచంద్రన్, కలెక్టర్
ఇండ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలి
ఈద్-ఉల్ -ఫితర్ రోజు ముస్లింలు తమ ఇండ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని నిర్ణయించాం. కొవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలింగనం చేసుకోకుండా శుభాకాంక్షలు చెప్పుకోవాలి.
-ఎంఏ. మజీద్, ఈద్గా కమిటీ ప్రధానకార్యదర్శి, రామన్నపేట