యాదాద్రి, ఏప్రిల్13: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం శ్రీపర్వతవర్ధనీ సమే త రామలింగేశ్వర స్వామి బాలాలయంలో ప్లవనామ సంవత్సరం మంగళవారం శ్రీసీతారామ చంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రా రంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు చరమూర్తులు కొలువైన ఉపాలయంలో ఆస్థానపరంగా శ్రీకారం చుట్టారు. గణపతికి తొలిపూజలు చేపట్టిన పురోహితులు పుణ్యాహవాచనం, అఖం డ దీపారాధన, రక్షాబంధన, నిత్యపూజా కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, పురోహితుడు సత్యనారాయణశర్మ, శివాలయం ప్రధానార్చకుడు నరసింహ్మరాములశర్మ, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
వైభవంగా క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంత గల గుడిలో హనుమంతుడిని సింధూరం తో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తమలపాకులతో అర్చన, లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
స్వామివారికి నిత్యారాధనలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజామునకే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసిఅర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన నారసింహహోమం అనంతరం శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం జరిపారు. స్వామివారి అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదాయం రూ. 3,67,896
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామివారి ఖజానాకు రూ. 3,67,896 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 26,940, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 13,400, ప్రచారశాఖ ద్వారా రూ. 6,540, క్యారీబ్యాగుల ద్వారా రూ. 2,100, వ్రతాల ద్వారా రూ. 11,500, కల్యాణకట్ట ద్వారా రూ. 9,800, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 2,00,560, వాహనపూజల ద్వారా రూ. 3,600, టోల్గేట్ ద్వారా రూ. 1,280, అన్నదాన విరాళం ద్వారా రూ. 2,600, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 36,636, యాదరుషి నిలయం ద్వారా రూ. 21,200, పాతగుట్ట ద్వారా రూ. 3,940, టెంకాయల విక్రయాలతో రూ. 27,000తో కలిపి స్వామివారికి రూ.3,6 7,896 ఆదాయం లభించిందని ఆమె తెలిపారు..