రామన్నపేట, ఏప్రిల్ 13: ముస్లింలు అత్యంత పవి త్రంగా భావించే మాసం రంజాన్.. రంజాన్ మాసం ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆధ్యాత్మిక, సోదరభావాన్ని పరిమళింపజేసే పవిత్ర మా సంగా రంజాన్ను భావిస్తారు. ముస్లింల దైవం అల్లాహా తన దైవ సందేశాన్ని ప్రవక్త హజ్రత్ మహ్మద్ సల్లెల్లా హు అలైహీ వసల్లం ద్వారా ఈమాసంలో దివ్య ఖురాన్ గ్రం థంను భూమి మీదకు దింపిన మాసం రంజాన్గా భా వించి ఈ మాసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గడుపు తా రు. ఈ మాసంలో నిష్టతో కూడిన ఉపవాస దీక్షలు పాటి స్తారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలోని 9వ మాసంలో రంజాన్ వస్తుంది.
రోజా (ఉపవాసదీక్షలు)
రంజాన్ నెలలో చంద్రమానంను బట్టి 29, 30 రోజులు రోజా ఉంటారు. సూర్యోదయం కంటే ముందే నిర్ధారిత సమయంలో ఆహార పానియాలు తీసుకుంటారు. దీనిని ’సహార్’అంటారు. దీక్ష సమ యంలో ఆహారం, నీరు తీసు కోక పోవడమే కాదు, కనీసం లాలాజలాన్ని కూడా గొంతు దాటి లోనికి వెళ్లకుండా జా గ్రత్త పడుతారు. దీక్ష పరులు అన్ని రకాల చెడు కార్యాలు, అధర్మ కార్యాలకు దూరంగా ఉంటారు. దీక్ష సమయంలో ఖురాన్ పఠనంతో పాటు, న మాజులు చేస్తూ, దాన ధర్మా లు నిర్వహిస్తూ తనకు తాను అంతర్గతంగా చేసిన తప్పుల కు ఆత్మప్రక్షాళన చేసుకుంటూ ఉంటారు. పేదలు పడే ఆకలి దప్పుల బాధ ఎలా ఉంటుం దో ధనవంతులకు, ఉపవాసా ల మూలంగా అనుభవంలోకి వస్తుంది. సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్ష విర మణ చేస్తారు. దీన్ని ’ఇఫ్తార్’ అంటారు. ఖర్జూరాలు, ఇతర ఫలాలతో దీక్ష విరమిస్తారు.
మూడు భాగాలుగా రంజాన్
రంజాన్ నెలను మూడు భాగాలుగా భావిస్తారు. ఇం దులో తొలి పదిరోజులు ఉపవాస దీక్షను రహమత్కా అష్రా(దయను పొందుట) రెండో పదిరోజుల దీక్షను మ ఘ్ఫిరత్కా అష్రా (క్షమ కోరడం) మూడో పదిరోజుల దీక్షను జహనుమ్ సే నజాత్ (నరకం నుంచి విముక్తి ) అని పిలుస్తారు. చివరి పది రోజుల్లో 21, 23, 25, 27, 29, రోజుల్లోని రాత్రుల్లో జాగరణ చేస్తే 83 సంవత్స రాల 4నెలలు పుణ్యకార్యాలు చేసినట్లు పుణ్య ఫలాలు లభిస్తాయని, పాపాలు తొలగిపోతాయని, కోరికలు తీరు తాయని విశ్వాసంతో జాగరణ చేస్తారు. ఈ రాత్రులను తాఖ్రాత్లు అంటారు.
తరావీ నమాజ్…
జాన్ నెలలో ప్రత్యేకంగా ఇషా నమాజ్ తరువాత తరావీ నమాజ్ చేస్తారు. ఇందులో ఖురాన్ గ్రంధంలో ఉన్న 30 అధ్యాయాలను(పారాలను) రోజు ఒకటిన్నర పేరాలను హఫీజ్ ఏ ఖురాన్ ప్రతిరోజు తరావి నమా జులో చదివి 30 అధ్యాయాలను రంజాన్ తరావీ నమా జ్లో పూర్తి చేస్తారు. రంజాన్ నెల చంద్రుడు కనిపించ గానే ఈ తరావీ నమాజును ప్రారంభిస్తారు. నెల చంద్రు డు కనిపించగానే షావాల్ మాసం ప్రారంభం కావడం తో ఈతరావీ నమాజును ముగిస్తారు. మరుసటి రోజు ఈదుల్ ఫితర్ పండుగను జరుపుకుంటారు.
ఏతెకాఫ్…
రంజాన్ చివరి పది రోజుల్లో ఏతెకాఫ్ నిర్వహిస్తారు. 21వ రోజు మగ్రిబ్ నమాజుకు ముందు నుంచి పండు గ ముందు రోజు మగ్రిబ్ నమాజ్ తరువాత వరకు ఏతె కాఫ్ ను నిర్వహిస్తారు. వారు బాహ్య ప్రపంచాన్ని పూర్తి గా మరిచి మసీదుల్లో దైవ ప్రార్థనల్లో నిమగ్నమవుతా రు. సమస్త ప్రజల గురించి అల్లాను ప్రార్థిస్తారు. అందరి సమస్యలు పరిష్కరించాలని, అందరికి సరైన మార్గం చూపాలని వేడుకుంటారు.ఏతేకాఫ్ చేసిన వారికి జన్నత్ (స్వర్గం)లో చోటు లభిస్తుందని వీరి విశ్వాసం. పండుగ నెల వంక కనిపించిన తరువాత ఏతెకాఫ్ను ముగిస్తారు.
జకాత్..
ఇస్లాం మూల స్థంభాలలో జకాత్ ఒకటి జకాత్ అంటే తన ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు పంచి త న సంపదను ధార్మికం చే సుకోవడం. ముస్లింలు ఎ క్కువగా రంజాన్ నెలలోనే జకాత్ తీస్తారు. తన సం వత్సర ఆదాయం, ధనం నుంచి 2.5శాతం తమ కు టుంబాల్లోని పేదలకు, ని స్సాహయులకు, సంపాద న మార్గాలు లేని వారికి ఈ జకాత్ అందజేస్తారు. దీని ద్వారా తన ధనం, ఆ త్మ, శుద్ధి అవుతుందని వి శ్వాసం.ఈ నెలలోనే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తా రు. తద్వారా ఒక రూపా యికి డబ్బు రూపాయలు ఖర్చు చేసే పుణ్యం కలుగు తుందని జకాత్ చెల్లిస్తే పర లోకంలో బహుమానాలు ఉంటాయని, జకాత్ చెల్లిం చని వారికి శిక్ష తప్పదని వారి నమ్మకం.
ఫిత్రా..
జకాత్తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు పూటల ఆహారం, ఒంటి నిండా బట్టలు నోచుకోని పేదవారికి పండుగ సందర్భం లో దానం చేయాలని ఇస్లాం మతం భోధిస్తుంది. దీనినే ఫిత్రా అని పిలుస్తారు. ఉపవాస వ్రతాలు విజయవం తంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు ఈ ఫిత్రా దానం చేస్తారు. ఇందులో రెండు కిలోల గోధు మలకు గాని, దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాల ను, లేదా దానికి సమానమైన డబ్బును పంచిపెట్టాలి. ఈ దానంను కుటుంబ సభ్యులందరి తరుపున పేదలకు అందజేయాలి. దీనివలన ఉపవాస సమయంలో హృద యంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటి నుంచి వెలువడే అసత్యాలు, పొరపాట్లు జరుగుతుంటా యి. ఈ ఫిత్ర దానం వల్ల అవి క్షమించబడతాయని, పు ణ్యం దక్కుతుందని నమ్మకం.. ఈఫిత్రా దానం వల్ల ప్ర తి పేదవాడు పండుగ చేసుకునే అవకాశం కలుగుతుంది.