చౌటుప్పల్, జూలై12: కుమార్తెలకు ఉరివేసి తా నూ ఆత్మహత్య చేసుకున్న తొర్పునూరి ఉమారా ణి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఉమారాణి చిన్న కుమార్తె శైలిని మున్సిపాలిటీ పరిధిలోని ఆమె గృహంలో పరామర్శించి రూ.లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారి విద్యాభ్యాసానికయ్యే ఖర్చు భరిస్తానని, ఆమెను అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఆర్టీఏ జిల్లా మెంబర్ తడక చంద్రకిరణ్, కౌన్సిలర్లు ఎండి బాబాషరీఫ్, సుల్తాన్రాజు, లింగస్వామి, శాఖ గ్రంథాలయం చైర్మన్ మల్లేశ్గౌడ్, పరమేశ్, స్వామిగౌడ్, బాలకృష్ణ, వెంకట్రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సీఎం సహా యనిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభా కర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లారెడ్డిగూడె నికి చెందిన లింగస్వామికి రూ.40వేలు, చిమిర్యాలకు చెందిన లింగయ్యకు రూ.14,500 వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను సోమవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కొండ శ్రీను,జినుకుల కిరణ్, చంద్రశేఖర్, గాలయ్యపాల్గొన్నారు.