భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
బీబీనగర్, జూలై 10: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. నాలుగో విడుత పల్లె ప్రగతిలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని పడమటిసోమారం రోడ్డు నుంచి వైబ్రా పరిశ్రమ వరకు, నెమరగోములలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అం దరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖస్థాయీ సంఘం చైర్పర్సన్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, చింతల సుదర్శన్ రెడ్డి, నారగోని మహేశ్, చెంగలి కిషన్రావు, మంగ అశోక్, ఎండీ అక్బర్, ఎంపీటీసీ వీరునాయక్, మన్నె బాల్రాజు, ఎలుగల నరేందర్, బింగి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
ముగింపు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే
నాలుగో విడుత పల్లె ప్రగతిలో భాగంగా బీబీనగర్ లో పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని సమస్యలను గ్రామ సభలు నిర్వహించి పరిష్కరించుకోగలిగామన్నారు. బీబీనగర్లో ఇప్పటికే రూ. 6.5 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇంకా పూర్తి చేయాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడానికి కోటి రూపాయలు మంంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డీఈవో చైతన్యజైనీ, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీఓ స్వాతి, నాయకులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు