రామన్నపేట, జూలై10: పల్లెల అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మార్కండేయ అన్నారు. శనివారం మండలంలోని బోగారంలో సర్పంచ్ అంతటి పద్మారమేశ్తో కలిసి ఆయన మొక్కలు నాటారు. పల్లెప్రగతి చివరిరోజును పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వివరించారు. మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి గ్రామసభ సర్పంచ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ అధ్యక్షతన జరిగిం ది. ఇందులో మండల ప్రత్యేకాధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేంధర్రెడ్డి, ఎంపీవో కృష్ణమోహన్ పాల్గొన్నారు. అదేవి ధంగా వెల్లంకి గ్రామంలో గ్రామసభ అనంతరం సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి పూలు, పండ్ల మొక్కలను స్థానికులకు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, పిట్ట కృష్ణారెడ్డి, ఉప్పు ప్రకా శ్, నీల జయలక్ష్మీదయాకర్, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్రెడ్డి, నర్సింహ్మ, రేహాన్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధి కోసమే..
మోత్కూరు, జూలై10: పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని జిల్లా బీసీ సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పాటిమట్ల, దాచారం, పొడిచేడు గ్రామాల్లోని పల్లె ప్రగతి గ్రామసభల్లో పాల్గొని మాట్లాడారు. పది రోజులపాటు జరిగిన కార్యక్ర మం ద్వారా గ్రామాల్లోని అనేక సమస్యలను గుర్తించి పరి ష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. పారిశుధ్య చర్యలు, పా త ఇండ్లు కూల్చివేత, పల్లెప్రకృతివనాల సందర్శన, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, వన నర్సిరీల్లో మొక్కలను పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గుర్తించిన పల్లెప్రగతి పనులను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మండలంలోని పాలడుగు, దత్తప్పగూ డెం, పనకబండ, రాగిబావి, ముశిపట్ల, అనాజిపురం, సదర్శాపురం గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించారు. పొడిచేడు గ్రామసభలో ఎంపీపీ సంధ్యారాణి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్రెడ్డి, ఎంపీవో సురేందర్రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి
వలిగొండ, జూలై10: అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుం దని ఎంపీపీ నూతి రమేశ్రాజ్ అన్నారు. శనివారం పల్లెప్రగతి కార్యక్రమ ము గింపులో భా గంగా సంగెం, వర్కట్పల్లి, గోకా రం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు జయప్రదం కావాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కీసరి రాంరెడ్డి, మీసాల శేఖర్, మాధవీసురేందర్, మండల ప్రత్యే కాధికారి అన్నపూర్ణ, ఎంపీడీవో గీతారెడ్డి, ఎంపీ వో కేదారీశ్వర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి గ్రామసభ
చౌటుప్పల్ రూరల్, జూలై10: పల్లెప్రగతి ము గింపు కార్యక్రమంలో భాగంగా మండలవ్యాప్తంగా శనివారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను చర్చించారు. అంతకు ముందు గ్రా మాల్లో పలుచోట్ల మొక్కలునాటారు. పది రోజు లపాటు చేపట్టిన పనులను పర్యవేక్షించారు.
పల్లెప్రగతి నిరంతర కార్యక్రమం
సంస్థాన్ నారాయణపురం, జూలై10: పల్లెప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని మం డల ప్రత్యేకాధికారి మన్యానాయక్, ఎంపీడీవో బండారి యాదగిరి అన్నారు. శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్ర మం కొనసాగింది. ఈ సందర్భంగా అధికారు లు కోతులాపురం గ్రామంలో పల్లెనిద్రలో పా ల్గొని ఉదయం గ్రామంలో పర్యటించి పల్లె ప్రగ తి పనులను పరిశీలించారు. వివిధ గ్రామాల్లో సర్పంచ్లు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, కంపచెట్లను తొలగించారు. హరితహారంలో భాగంగా ప్రజలకు మొక్కలను పంపి ణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు పోట్ట సత్యం, దోనూరి జైపాల్రెడ్డి, యాదయ్య గౌడ్, సుశీల, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.