గురువారం 16వేల కిలోమీటర్లు నడిచిన ఆర్టీసీ బస్సులు
యాదాద్రి, జూన్10: కొవిడ్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ఉదయం 6నుంచి సా యంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం సడలింపు నిచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ తన ఆదాయం పెం పు పై దృష్టి సారించింది. గత నెల 12వ తేదీ నుంచి బుధవారం నాటికీ కేవలం పరిమిత సంఖ్యలో ఆర్టీసీ బస్సులను నడిపించిన ఆర్టీసీ అధికారులు.. తాజా సడలింపుతో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెం చా రు. గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 45 ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరా బాద్, సికింద్రాబాద్తోపాటు తిరుమలగిరి, నల్లగొండ, వనపర్తి, అల్లంపూ ర్, మక్తల్, నారాయణఖేడ్, నిజామాబాద్, బాసరకు నడిపినట్లు తెలిపా రు. సడలింపుతో మోటకొండూర్, రా జాపేట, మోత్కూరు, ఆలేరు, చేర్యా ల, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్కు 15 నిమిషాలకు ఒక బస్సును నడిపినట్లు చెప్పారు. ఆర్టీసీ వాహనాలకు శానిటైజేషన్ చేసి, ప్రయాణికులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. గురువారం 16, 000 కిలోమీటర్లు పైగా బస్సులను నడిపించగా, రూ.3.90 లక్షల ఆదా యం సమకూరిందని అన్నారు.