మోత్కూరు , జూన్ 10: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కొవిడ్ పాజిటివ్ బారిన పడిన కటుంబాలకు మోత్కూరు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలను పంపి ణీ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో త హసీల్దార్ షేక్ ఆహ్మద్, ఎస్సై ఉదయ్కిరణ్, మున్సిపల్ కమిష నర్ షేక్మహమూద్, ఆర్యవైశ్య సంఘం పట్టణఅధ్యక్షుడు మొ గుళ్లపల్లి సోమయ్య,గౌరవాధ్యక్షుడు సోమ వెంకటేశ్వర్లు, కోశా ధికారి బుక్క విశ్వనాథం తదితరులు వాటిని అందజేశారు.
రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో
మోత్కూరు మండల పరిధిలోని పనకబండ, సదర్శాపురం, కొండగడప, బుజిలాపురం, పాటిమట్ల గ్రామాల్లో హైదరాబాద్ రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవిడ్ బాధిత కటుంబాల కు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. గురువారం ఆయా గ్రామా ల్లో ఫౌండేషన్ అధ్యక్షుడు ఉదయ్కుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడు మనోజ్కుమార్రెడ్డి, ఎస్సై ఉదయ్కిరణ్, డాక్టర్ శ్రీనివాస్ టీఆ ర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, ప్రధాన కార్యద ర్శి గజ్జి మల్లేశ్, సర్పంచ్లు బత్తిని తిరుమలేశ్, దండెబోయిన మల్లేశ్, వర్రె కవిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
130 మందికి వ్యాక్సిన్
మోత్కూరు: మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మోత్కూరు,గుండాల, అడ్డగూడూరు మండలాల పరిధిలోని 130మంది సూపర్స్ప్రెడర్లకు మొదటి డోస్ కోవీషీ ల్డ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు.
పండ్లు పంపిణీ
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశకార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులు మర్రి అనిల్ అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో నాయకులు బోడ శ్రీను, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా జాగ్రత్తలు పాటించాలి
బీబీనగర్: లాక్డౌన్తో కరోనా కేసులు తగ్గినా కరోనా జాగ్ర త్తలు తప్పనిసరిగా పాటించాలని సర్పంచ్ల ఫోరం మండలా ధ్యక్షుడు మంచాల రవి కుమార్ అన్నారు. గురువారం మండ లంలోని రహీంఖాన్గూడ వీదుల్లో పంచాయతీ సిబ్బందితో సోడియం హైపొక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
శానిటైజర్ స్టాండ్లు, మాస్కులు అందజేత
ఆత్మకూరు(ఎం): కరోనా వైరస్ నిర్మూలన కోసం తన వంతు సహకారంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఉ పాధి హామీ కార్యాలయానికి టీఆర్ఎస్ మహిళా విభాగం మం డల అధ్యక్షురాలు సోలిపురం అరుణాఉపేందర్రెడ్డి దంపతులు శానిటైజర్ స్టాండుతో పాటు మాస్కులు అందజేశారు. కార్యక్ర మంలో ఏపీవో రమేశ్, టీఏలు యాదిరెడ్డి, స్వామి, శ్రీశైలం, సీవోలు శ్రావణ్కుమార్, సాయితేజ, మహేశ్వరీ పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు అందజేత
మండల కేంద్రంలోని కరోనా బాధిత కుటుంబాలకు గురువా రం రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం దశరథగౌడ్ నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు మల్లెల పర్వతాలు, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు బూడిద శేఖర్, ఉపాధ్యక్షుడు గడ్డం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.