రామన్నపేట, జూలై9: పల్లెప్రగతి కార్యక్రమం మండలంలోని పలు గ్రామాల్లో పండుగలా నూతన శోభను సంతరించుకున్నది. శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా పంచాయతీలు, రైతువేదికలు, అంగన్వాడీ కేంద్రాలను మా మిడి తోరణాలు, అరటి ఆకులు, కొబ్బరిమట్టలు, పూలతో సుందరంగా అలంకరించారు. ఆవరణాల ఎదుట ముగ్గులు వేశారు. వెల్లంకి గ్రామంలో సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేంధర్రెడ్డి పాల్గొన్నారు. వైకుంఠధామం వద్ద మొక్కల గుంతలను తీసి మొక్కలను నాటారు. పంచాయతీ కార్మికులకు హెల్మెంట్లు, గ్లౌజ్లు, మాస్క్లు అందజేశారు. మండల కేంద్రంలో పచ్చదనం పరిశుభ్రతపై సర్పంచ్ గోదాసు శీరిషాపృథ్వీరాజ్ అవగాహన కల్పించారు. పల్లివాడ గ్రామంలో సర్పంచ్ కడమంచి సంధ్యాస్వామి మొక్కలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీవో కృష్ణమోహన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గుత్తా నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్రెడ్డి, సర్పంచ్లు అప్పం లక్ష్మీనర్సు, పిట్ట కృష్ణారెడ్డి, అంతటి రమేశ్, ఉప్పుప్రకాశ్, కాటేపల్లి సిద్ధమ్మా యాదయ్య, రాణి, రేఖాయాదయ్య, ఎంపీటీసీలు గొరిగే నర్సింహ్మ, రేహాన్, పూస బాలమణి, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, బడుగు రమేశ్ పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
చౌటుప్పల్ రూరల్, జూలై9: పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఎల్లగిరి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహసీల్దార్ గిరిధర్ పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, ఉపసర్పంచ్ బుచ్చిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి భవాని తదితరులు పాల్గొన్నారు.
మొక్కల పంపిణీ
బీబీనగర్, జూలై9: నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సర్పంచ్ మంచాల రవికుమార్ అన్నారు. మండలంలోని రహీంఖాన్గూడలో పల్లెప్రగతిలో భాగంగా పంచాయతీ ఆవరణలో దాతల సహకారంతో 1000 మొక్కలను గ్రామంలోని ప్రతి ఇం టికి రెండు చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాపాక జంగయ్య, వార్డు సభ్యులు, పంజాల భుజంగరావు, పంచాయతీ కార్యదర్శి బి.సునీత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు లావ ణ్య, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పల్లెప్రగతితో గ్రామాలాభివృద్ధి
అడ్డగూడూరు, జూలై9: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయ ని ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య అన్నారు. వెల్ధే వి గ్రామంలో శుక్రవారం పల్లెప్రగతిలో భాగంగా వారు మొక్కలను నాటారు. అనంతరం పల్లెప్రకృతివనాన్ని పరిశీలించారు. గ్రామంలో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీటీసీ వెంకటయ్య, ఏపీవో రవీందర్, ఉపసర్పంచ్ రామచంద్రు, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
జోరుగా పల్లెప్రగతి పనులు
వలిగొండ, జూలై9: పల్లెప్రగతి పనులు మండలంలోని అన్ని గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం సంగెం, వర్కట్పల్లి, సుంకిశాల, చిత్తాపురం, దుప్పెల్లి, నర్సాపురం, గొల్నెపల్లి, గోపరాజుపల్లి, వలిగొండ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలను రంగురంగుల ముగ్గులేసి పూలతో అలకరించారు. వీధులను శుభ్రం చేసి హరితహారంలో భా గంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఏనుగు అంజిరెడ్డి, సర్పంచ్లు కీసరి రాంరెడ్డి, మీసాల శేఖర్, మొగిలిపాక నర్సింహ్మ, ఎంపీడీవో గీతారెడ్డి, మండల ప్రత్యేకాధికారి అన్నపూర్ణ, ఎంపీవో కేదారీశ్వర్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.