భువనగిరి అర్బన్,జూలై9: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామా లు పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్నాయని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి భు వనగిరి జిల్లా వాసాలమర్రిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లాలోని గ్రామాలకు రూ.25 లక్షల నిధులు కేటాయిస్తామని ప్రకటించి విడుదల చేసిన సందర్భంగా మండలంలోని తుక్కా పురంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాటను ఏనాడు తప్పలేదని, గ్రామాలకు నిధులు ఇస్తానని చెప్పిన నెల రోజుల్లోనే రూ.25 లక్షలు విడుదల చేయడం హార్షణీయమన్నారు. ప్రభుత్వం చేప ట్టిన పల్లెప్రగతిలో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. గత ప్రభుత్వాల హాయంలో గల్లీల్లో తాగునీటికి లొల్లి పుట్టేద న్నారు. వార్డుల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, మురుగునీటి గుంటలు దర్శనమిచ్చేవని, సీఎం కేసీఆర్ ప్రణాళికతోనే గ్రా మాల్లో పరిశుభ్రంగా మారాయన్నారు. గ్రామల్లో ఏ వార్డును చూసినా సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి వీధిలో విద్యు త్ లైట్లు, ఇంటింటికీ గోదావరి జలాలు, గ్రామంలో ప్రతిరోజూ చెత్త సేకరణ, సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించ డం వంటి పనులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.
గతం లో గ్రామ సిబ్బందికి చాలీచాలని వేతనాలు వచ్చేవని, దీంతో గ్రామంలో ఎక్కడ చూసినా ఆపరిశుభ్రతే దర్శనమి చ్చేదన్నా రు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ సిబ్బందిని పెంచి, జీతాలు పెంచడంతో గ్రామాలు అద్భుతంగా మారాయన్నారు. గత ప్ర భుత్వాలు గ్రామాలకు నిధులు అడిగినా ఇవ్వలేదని, సీఎం కే సీఆర్ అడగక ముందే అదనంగా రూ. 25 లక్షలు నిధులు కే టాయించి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చుకోవాలని చెప్పడంతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. గ్రామా లకు అదనంగా నిధులు కేటాయించడంతో ప్రజా ప్రతినిధుల భాద్యత మరింత పెరిగిందని, దీంతో గ్రామా లను ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు. గతంలో గ్రామాల్లో వైకుంఠధామా లు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం వంటి కార్యక్రమాలు లేవని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్ర త్యేక పథకాలతో గ్రామాలకు మహార్ధశ వచ్చిందన్నారు. కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అమరేందర్, భువనగి రి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, ఎంపీపీ నిర్మల, భువ నగిరి పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్రెడ్డి, జడ్పీటీసీ మల్లయ్య, రైతుబంధు మండల కన్వీనర్ మల్లయ్య, సర్పంచ్ రాజిరెడ్డి, వై స్ ఎంపీపీ సంజీవరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ మధుసూ దన్రెడ్డి, మండలాధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్గౌడ్, నాయకు లు లక్ష్మీనారాయణగౌడ్, మోహన్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, పవ న్సతీశ్, కృష్ణ, సత్యనారాయణ, మల్లికార్జున్ వీరేశ్యాదవ్, మహేశ్, మధు, ప్రవీణ్కుమార్, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ మల్లేశ్, ఉప సర్పంచ్ సతీశ్, పాల్గొన్నారు.
రఘునాథపురంలో
రాజాపేట: కార్మికులకు బీమా పథకం ప్రవేశపెట్టడాన్ని హర్షి స్తూ మండలంలోని రఘునాథపురంలో శుక్రవారం చేనేత ఆ సంఘ నాయకులు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, ప్రభు త్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి చిత్రపటానికి క్షీరా భిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్ కుమార్, నాయ కులు సిద్ధిరాములు, జనార్ధన్, బోగ రాజు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలబిషేకం
అడ్డగూడూరు మండల కేంద్రంలోఅడ్డగూడూరు: సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీలకు రూ.25 లక్షలు నిధులు విడుదల చేయడంతో మండల కేంద్రంలో స ర్పంచ్ల అధ్వర్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గ్రా మాల సమస్యలు రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ఈ నిధు లుమంజూరు చేశారన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ జ్యోతి, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆ ర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, సర్పంచ్లు సోమిరెడ్డి, సత్త య్య, త్రివేణి, పరమేశ్, కుమార్స్వామి, జ్యోతి, పాల్గొన్నారు.
తుర్కపల్లి మండల కేంద్రంలో
తుర్కపల్లి: గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు నిధులు మంజూరు చేయడంతో పాటు జీవోను విడుదల చేయడాన్ని హార్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో టీఆర్ఎ స్ పార్టీ ఆధ్వర్యంలో మండల సర్పంచ్లు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీల, జడ్పీ వైస్ చైర్మన్ భీకూ నాయక్, సర్పంచ్లు వనిత, సత్యనారాయణ, మల్లప్ప, మంజుల, శారద, లలిల, ఎంపీటీసీ కరుణాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, రైతుబం ధు మండల కన్వీనర్ నర్సింహులు, వెంకటేశ్, శంకర్నాయక్, విజయ్, లచ్చిరాం, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.