యాదగిరిగుట్టరూరల్, జూలై9: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదా ద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నిత్యారా ధనలతో హరిహరులు భక్తులను అలరించారు. బాలాలయం లో పంచనారసింహులను కొలుస్తూ, అభిషేకం అర్చనలు చేప ట్టారు. నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేకువజా మున స్వామి అమ్మవార్లను ఆరాధిస్తూ హారతి నివేదన జరిగిం ది. ఉత్సవమూర్తులను స్వర్ణ పుష్పాలతో అర్చించారు. అర్చకు లు ఆలయంలో స్వామి వారికి నిత్యకల్యాణం, సుదర్శన నార సింహ హోమం, గజవాహన సేవ చేపట్టారు. సాయంత్రం బా లాలయంలో ఆండాళ్ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అ లంకరించి ఊంజల్సేవ నిర్వహించారు. వివిధ రకాల పూల తో, తులసీ దళాలతో పూజలు చేపట్టారు. అర్చకులు ఆండాళ్ అమ్మవారికి హారతినిస్తూ కీర్తన చేశారు. స్వామి వారికి శుక్రవా రం వివిధ విభాగాల నుంచి రూ. 5,43,087 లక్షలు ఆదా యం సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
స్వామివారికి వెండి కలశం బహూకరణ
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి వరంగల్ జిల్లా కిష్టాపురాని కి చెందిన గట్టు నరసింహచార్యులు కుటుంబ సభ్యులు వెండి కలశాన్ని బహూకరించారు. నరసింహాహచార్యులు, నవీన్ చా ర్యులు, రంగాచార్యులు వారి కుటుంబ సభ్యులు కలిసి శుక్రవా రం దేవస్థానం అర్చక సిబ్బందికి వెండి కలశాన్ని అందజేశారు