రాజాపేట, ఏప్రిల్9 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కా ర్యక్రమంతో నర్సాపూర్ గ్రామ రూపురేఖలే మారిపో యా యి. వైకుంఠధామం పనులు పూర్తి కావడానికి రాగా, కంపోస్ట్ షెడ్పనులు పూర్తయ్యాయి. హరితహారంలో నాటిన మొక్కలు కనువిందు చేస్తున్నాయి. మిషన్ భగీరథ ట్యాంక్తో స్థానికుల నీటి తిప్పలు తీరాయి. అదేవిధంగా జిల్లాలో మూడు గ్రామ పంచాయతీలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఎంపిక కాగా, అందులో ఒకటి మం డలంలోని నర్సాపూర్ గ్రామం ఉండటం విశేషం. దీంతో మండలంలోనే ఆదర్శ గ్రామంగా ఎంపికై గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్ నుంచి ఉత్తమ గ్రామ పంచాయతీతోపాటు ఉత్తమ సర్పంచ్గా గోపిరెడ్డి అవార్డును అందుకున్నారు. నర్సాపూర్లో 957మంది జనాభా ఉండగా, 213 నివాస గృహాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ గ్రామం సారా తయారీ కేంద్రంగా ఉండేది. గ్రామస్తుల్లో మార్పు రావడంతో సారా తయారీకి పూర్తిగా స్వస్తి పలికి, కొన్నా ళ్లు సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దారు. వ్యవసాయ ఆధారిత గ్రామమైనప్పటికీ ఇక్కడి ప్రజలు నూతన సాంకేతికతతో పంటలు సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. గ్రామ అభివృద్ధిలో గ్రామ స్తులు, పాలకవర్గం సహకారం మరువలేనిది.
పల్లెకు ప్రగతి శోభ..
పల్లె ప్రగతిలో భాగంగా మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించుకోవడంతో పల్లెకు ప్రగతి శోభ సంతరించుకున్నది. గ్రామంలో అంతర్గత రోడ్లతోపాటు డంపింగ్యార్డు నిర్మాణం, హరితహారంలో నాటిన మొక్కలతోపా టు పల్లెప్రకృతివనంతో గ్రామం అందంగా కళకళలాడు తున్నది. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ట్రాక్టర్తో ఇం టింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తూ గ్రామ శుభ్రతకు పాటుపడుతున్నారు. హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా 1,600 మొక్కలు నాటి పెం చడంతో ఆహ్లాదకరంగా మారింది. పల్లెప్రగతి కార్యక్రమా న్ని గ్రామస్తులు పక్కాగా అమలు చేస్తున్నారు. గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రజలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశా రు. పారిశుధ్య పనుల్లో గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోనే మొదటగా గ్రామంలో రూ. 3.50లక్షలతో డంపింగ్యార్డును నిర్మించడంతో సర్పంచ్ను ఉన్నతాధికారులు అభినందించారు. ఉపాధిహామీ పథకం లో మంజూరైన రూ.12లక్షలతో వైకుంఠధామం పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. పల్లెప్రకృతివనంలో మొ క్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. వననర్సరీ నిర్వహణతోపాటు అంతర్గత రోడ్లను నిర్మించారు.
ఇవీ కూడా చదవండి…
రాహుల్ ద్రవిడ్ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?