మోటకొండూర్, ఏప్రిల్ 9 : కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వీడి, 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా క్టర్ పరిపూర్ణాచారి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంత్ అ న్నారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలోని కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోజుకు 200 మందికి కొవిడ్ టీకాను ఇవ్వాలన్నారు. అదే విధంగా పీహెచ్సీలో మండలానికి చెందిన పలువురికి కొవిడ్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండల వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రవీణ్కుమార్, దేవావర, ధనమ్మ ఉన్నారు.
రహదారి బంగ్లాలో అదనపు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం
బీబీనగర్, ఏప్రిల్9: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ప్రజల సౌకర్యార్థం రహదారి బం గ్లాలో అదనపు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎంపీపీ సుధాకర్గౌడ్ ఆ కేం ద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 45 ఏండ్ల దాటిన వారందరూ అపోహలు వీడి కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ దాక్షాయణి, డాక్టర్ గీత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో 70 మందికి టీకా
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్9: మండల కేంద్రంలోని పీహెచ్సీలో వివిధ గ్రామాలకు చెందిన 45 ఏండ్లు పైబడిన 70 మందికి కొవిడ్ టీకా వేసినట్లు మండల వైద్యాధికారిణి ప్రణీష తెలిపారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ కూలీలకు సర్పంచ్ నగేశ్ కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో వారు టీకాలు వేయించుకున్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన 13మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పా జిటివ్గా తేలిందని మండల వైద్యాధికారిణి తెలిపారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి
వలిగొండ, ఏప్రిల్ 9: వలిగొండ, వర్కట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శుక్రవారం 17 మందికి కొవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్గా తేలిందని వైద్యాధికారి డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. ఈ సం దర్భం గా వైద్యాధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.
మాస్కులు ధరించని 12 మందిపై కేసు నమోదు
రామన్నపేట, ఏప్రిల్9: మాస్కులు ధరించకుండా తిరుగుతున్న 12మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రం లో తనిఖీలు చేసిన మాస్కులు ధరించని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట పోలీసులు యాదగిరి, శేఖర్, మహ్మద్ ఉన్నారు.
అడ్డగూడూరులో 106 మందికి టీకా
అడ్డగూడూరు,ఏప్రిల్ 9: 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని మండల వైద్యాధికారి నరేశ్ అన్నారు.శుక్రవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రంలో 106 మందికి కొవిడ్ టీకా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 15 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ధర్మారం గ్రామానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ తేలిందన్నారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా సెకండ్ వేవ్ తో యువతకే డేంజర్ : ఐఎంఏ ప్రెసిడెంట్ హెచ్చరిక
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!