యాదాద్రి, జూన్8: మృగశిర కార్తెను పుర స్కరించుకుని జిల్లాలో మార్కెట్లు మంగళవారం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కొవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నా జనం లెక్కచేయకుండా కొనుగోలు చేశా రు. మృగశిర కార్తె ప్రవేశించిన రోజున చేపలు తింటే మంచిదనే నానుడి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అధిక సం ఖ్యలో కొనుగోలుకు ఆసక్తి చూపారు. చెరువుల వద్ద కూడా సందడి నెలకొంది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను పెంచి విక్రయించారు. జిల్లాలోని చౌటుప్పల్, ఆలే రు, బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట పట్టణం, రామన్నపేట, మోత్కురు పరిసర ప్రాంతాల్లో రవ్వలు, బొచ్చెలు, జెల్ల వివిధ రకాల చేపలను సాధారణ రో జుల్లో రూ. 100కు విక్రయించగా, మృగశిర కార్తె రోజు రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయించారు. కొర్రమీను చేప ధర సాధారణ రోజుల్లో రూ.300 నుంచి 400 ఉండగా, మూసీనది పరీవాహక ప్రాంతాల్లో రూ.500, మిగతా ప్రాంతా ల్లో రూ. 600 -రూ.700 వరకు వ్యాపారులు విక్రయించినా మంగళవారం ప్రజ లు కొనేందుకు ఉత్సాహం చూపారు. చేపలతోపాటు చికెన్, మటన్ అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. మృగశిర కార్తె రోజున పంటల సాగు పనులను ప్రారంభిస్తే మం చిదని కొందరు రైతులు షురూ చేశారు.
చేపల అమ్మకాల జోరు
భూదాన్పోచంపల్లి, జూన్ 8: మృగశిర కార్తె రాకతో మండలవాసులు చేపల కొ నుగోలుకు ఆసక్తి చూపారు. ప్రతి ఏడాది కార్తె ప్రవేశించిన రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నదని స్థానికులు తెలిపారు. దీంతో వ్యాపారులు చేపల ధరలను పెంచి విక్రయించారు.
చౌటుప్పల్లో..
చౌటుప్పల్, జూన్8 : చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రజలు మృగశిర కార్తెను పుర స్కరించుకుని చేపల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున చేపలు తింటామని పలువురు తెలిపారు.
మృగశిర సందడి
ఆలేరు టౌన్, జూన్ 8 : ఆలేరులో మృగశిర సందడి నెలకొంది. ఈ సందర్భంగా చేపలకోసం ప్రజలు అధిక సం ఖ్యలో షాపుల ఎదుట క్యూ కట్టారు. మటన్, చికెన్ షాపులు వెలవెలబోయా యి. మృగశిర రోజు చేపలు తినాలన్న సెంటిమెంట్తో అధిక సంఖ్యలో ప్రజ లు కొనుగోలుకు ఆసక్తి చూపారు. కొర్రమీను చేపను వ్యాపారులు కిలో రూ. 600 విక్రయించారు.
మోత్కూరులో..
మోత్కూరు, జూన్ 8: మృగశిర కార్తెకు మండలవాసులు ఆనందంగా స్వాగ తం పలికారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు గ్రామ దేవతలకు పూజలు చేసి నైవేద్యం వండి పెట్టి కోళ్లు, యాటలతో మొక్కులు చెల్లించుకున్నా రు. మున్సిపాలిటీ కేంద్రంలో మటన్, చికెన్, చేపల దుకాణాలు మంగళవా రం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.