మోటకొండూర్, మే 7: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోటకొండూర్ మండల కేంద్రంలో శనివారం నుంచి 13 రోజులపాటు స్వచ్ఛంద లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు ఎస్ఐ నాగరాజు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు. శుక్రవారం పంచాయతీ ఆవరణ లో వర్తక , వ్యాపారులు, వివిధ పార్టీల నాయకులు, స్థానికులతో పంచాయతీ పాలకవర్గ సభ్యులు సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడు తూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ శ్రీలత పాలకవర్గ సభ్యులతో కలిసి స్వచ్ఛంద లాక్డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేటి నుంచి 13 రోజులపాటు ఉదయం 6నుంచి 2 గంటల వరకు వర్తక, వ్యాపారులు తమ షాపులను తెరిచి, మధ్యాహ్నం 2గంటల తర్వాత షాపులను మూసి వేసి స్వచ్ఛంద లాక్డౌన్కు సహకరించాలని కోరారు. నిబంధనలు పాటించని వారికి రూ. 2వేల జరిమానా విధిస్తామని పాలకవర్గ సభ్యులు తెలిపా రు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్కుమార్, రైతు సమన్వయ సమితి మండల కో- ఆర్డినేటర్ అయిలయ్య, వార్డు సభ్యులు నాగరాజు, జహంగీర్, వర్తక, వ్యాపారులు సుధాకర్, బలరాం, శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.
చందుపట్లలో స్వచ్ఛంద లాక్డౌన్
రోజురోజుకూ కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో వైరస్ను కట్టడి చేసేందుకు సర్పంచ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. ఈ క్రమంలో మండలంలోని చందుపట్ల గ్రామంలో నేటి మధ్యాహ్నం 3గంటల నుంచి ఉదయం 6 వరకు స్వ చ్ఛంద లాక్డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసి వేయాల ని, మాస్కులు లేకుండా బయట తిరిగిన వారికి జరిమానా విధిస్తామని సర్పంచ్ చిన్న పాండు, గ్రామ పెద్దల సమక్షంలో శుక్రవారం తీర్మానం చేశారు. గ్రామంలో వ్యవసాయ పనులు, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొండల్రెడ్డి, ఉప సర్పంచ్ కల్యాణి, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
మండలంలోని సూరెపల్లి, ఆకుతోటబావితండాల్లో శుక్రవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని గ్రామాల్లోని ప్ర ధాన వీధులు, వార్డుల్లో, ఇండ్ల ఆవరణాల్లో పిచికారీ చేశా రు. డ్రైనేజీ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ను సర్పంచ్లు పంచాయతీ సిబ్బందితో చల్లించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు లక్ష్మమ్మ, కేతావత్ సక్రమ్మ, కార్యదర్శులు స్వాతి, సాజీదాబేగం తదితరులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికే..
పోచంపల్లి మున్సిపల్ పరిధిలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాపా ర, వాణిజ్య సంస్థల నిర్వాహకుల సమ్మతితో ఈ నెల 8 నుంచి 21వతేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీశ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వ్యాపారులతో జరిగిన సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 21తేదీ వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులు తెరిచి ఉంటాయని, మధ్యాహ్నం 1గంట తర్వాత షాపులను మూసి స్వచ్ఛంద లాక్డౌన్కు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లింగస్వామి, కౌన్సిలర్లు చక్రపాణి, మధు, రవీందర్ పాల్గొన్నారు. అనంతరం రేవణపల్లి పరిధిలోని బసవలింగేశ్వర కాలనీలో వాటర్ ఫిల్టర్ను ఆమె ప్రారంభించారు.