యాదాద్రి, ఏప్రిల్ 7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వా మి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో పాం చరాత్రాగమశాస్త్రం ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన కొనసాగింది. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొ లువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పార్చనతో అర్చనలు చేయడం ఆలయ సంప్రదాయం. ఈ లక్ష పుష్పార్చనలో దేవస్థాన ఉప ప్రధానార్చకు లు, వేద పండితులు, అర్చక బృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా నిత్య కల్యాణం
స్వామివారి బాలాయంలో నిత్య కల్యాణం వైభవం గా జరిగింది. వేకువజామునకే స్వయంభులకు, బా లాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను అలంకరించి సుదర్శన నారసింహహోమం అనంతరం శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం జరిపారు. స్వామివారి అలంకార సేవోత్సవాలతో పా టు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించు కున్నారు. ప్రతిరోజూ ఒక్కో రకమైన పూజలు నిర్వహి స్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సా యంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవసంప్రదాయం గా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భ క్తులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో పరిమితి సం ఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఖజానాకు రూ. 2,59,258 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు రూ. 2,59,258 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 21, 242, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 5,800, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 200, క్యారీబ్యాగుల ద్వారా రూ. 1,100, వ్రతాల ద్వారా రూ. 20,000, కల్యాణకట్ట ద్వారా రూ. 13,400, ప్రసాద విక్రయా ల ద్వారా రూ. 1,28,235, వాహనపూజల ద్వారా రూ. 2,100, టోల్ గేట్ ద్వారా రూ. 510, అన్నదాన విరాళం ద్వారా రూ. 761, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 36,120, యాదరుషి నిలయం ద్వారా రూ. 23,780, పాతగుట్ట ద్వారా రూ. 4,710 తో కలిపి స్వామివారికి రూ. 2,59,258 ఆదాయం లభించిందని ఈవో తెలిపారు.
ఇవీ కూడా చదవండీ…
సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా : డీఐజీ రంగనాథ్
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
లైంగిక సామర్ధ్యం పెంచే మందుల పేరుతో రూ 2.17 లక్షలకు టోకరా!