భువనగిరి అర్బన్, ఏప్రిల్ 7: ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు కల్పించాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవా రం ఆమె కలెక్టరేట్లో యా సంగి సీజన్ ధాన్యం కొనుగో లు కేంద్రాల ఏర్పాటు విషయంపై కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, కీమ్యానాయక్లతో కలిసి డీఆర్డీఏ, పౌర సరఫరా, సహకార, వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రైతులు పండించిన పంట ను కొనుగోలు చేసేందుకు ఐకేపీ 98, పీఏసీఎస్ 186, మార్కెటింగ్శాఖ ద్వారా 4 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. అన్ని కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, తాగునీరు, చలువ పందిల్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లు పాయింట్లకు చేరవేసేందుకు ట్రాన్స్పోర్టు లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు టోకెన్లు జారీ చేయాలన్నారు. వరికి కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.1888, బీ గ్రేడ్ రూ. 1868ను అందజేయాలన్నారు.
కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఏఏ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లకు కలెక్టర్ అనితారామచంద్రన్ పలు సూచనలు చేశారు. కొవిడ్ రెండో ద శ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకుని గడిచిన సీజన్లో మారిదిగానే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. వడ్లు ఆరబోసి తాలులేకుండా కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్ద తు ధరను పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని, కేంద్రాల వద్ద మాస్కులు, భౌతిక దూరం పాటించేలా చర్య లు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు టోకెన్ల జారీని పారదర్శకంగా చేపడుతామని, లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. యాసంగికి జిల్లాలో 4లక్షల80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని అంచనా వేశామని, సరిపడా కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ ఉపేందర్రెడ్డి, ఆర్డీవో సూరజ్కుమార్, డీసీవో వెంకట్రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, డీఎస్వో బ్రహ్మరావు, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి
జిల్లాలోని పరిశ్రమల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నా రు. కేంద్రప్రభుత్వ సహకారంతో ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా ఉత్పత్తులపై కలెక్టర్ గూగుల్మీట్ ద్వారా పరిశ్రమలు, చేనేత జౌళీశాఖ, జిల్లా లీడ్బ్యాంకు తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం గూగుల్మీట్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని టై అండ్ డై హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ఎగుమతుల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. జిల్లాలోని టై అండ్ డై హ్యాండ్లూమ్ ఉత్పత్తులను మరింత నాణ్యతతో చేపట్టి వాటి ఎగుమతులకు నివేదికను రూపొందించాలని అన్నారు. సంబంధిత ఉత్పత్తిదారులు, వర్తకుల జాబితాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ గూగుల్మీట్లో పరిశ్రమలశాఖ జీఎం శ్రీలక్ష్మి, చేనేతజౌళీశాఖ ఎండి. వెంకటేశం, జిల్లా లీడ్బ్యాంకు అధికారి నాగార్జునబాబు, పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ రాజ్కుమార్, నాబార్డు అధికారులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్లో అడ్రస్ మార్చడమెలా
వైన్ కోసం మహిళ ఆర్డర్ : ఖాతా నుంచి రూ 1.6 లక్షలు గల్లంతు!
కొవిడ్కు గురైనవారిలో నాడీ, మానసిక రుగ్మతలు