సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వారికి లేదు
టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య
యాదాద్రి, జూన్6: ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నాయ కుడు జిన్నా హరినాథ్ రెడ్డి దొంగ నిరహార దీక్షలు చేస్తు న్నాడని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకట య్య ఆరోపించారు. సాగు నీటి ప్రాజెక్టులు, ఆలేరు ని యోజకవర్గంలో సాగు నీటి లభ్యతపై ప్రభుత్వ విప్ చేస్తు న్న కృషిపై ప్రశ్నించే అర్హత కాంగ్రెసోళ్లకు లేవని అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఎన్ని జలాశయాలు, కాలువలు, చెక్ డ్యాంలు నిర్మించారో చర్చకు రావాలని సవాల్ విసి రారు. టీఆర్స్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాయాం లో నియోజకవర్గంలో రూ. 12.46 కోట్లతో 10 నూతన చెక్ చెక్డ్యాంల నిర్మాణం చేపట్టామన్నారు. మరో 23 చెక్ డ్యాంలను ఆధునీకరించామని తెలిపారు.
రూ. 100 కోట్లతో మరో 26 చెక్ డ్యాంల నిర్మాణాలకు ప్రతిపాద నలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ప్రభుత్వ విప్ తీసుకు వెళ్లారని, నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారం భించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. త్వర లో పత్రికాముఖంగా వివరాలు ప్రభుత్వ విప్ వెల్లడిస్తార ని గుర్తు చేశారు. రాజాపేట మండలంలో కాల్వపల్లి నుం చి గౌరాయిపల్లి చెరువులోకి నీళ్లు వచ్చేవిధంగా సీసీ రో డ్డు కాల్వ నిర్మాణం, కల్వర్టు నిర్మాణాలు, గౌరాయిపల్లి నుంచి సాదువెల్లి, కాచారం చెరువుల్లోకి నీళ్లు వచ్చే విధం గా గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ పనులు ప్రారం భమవుతాయన్నారు. మల్లాపురం మినీట్యాంకు బండ్ నుంచి కాలువల ద్వారా మల్లాయ చెరువు, గుబ్బడి చెరు వులను నింపే బాధ్యత ప్రభుత్వ విప్ తీసుకున్నారని గు ర్తు చేశారు.
ప్రభుత్వ విప్ కృషితో ఉపాధిహామీ పథకం కింద రూ.10కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా 182 గొ లుసుకట్టు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని అ న్నారు. వేసవిలో సైతం చెరువుల్లో నీటి నిల్వలు ఉన్నా యంటే రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంటో అర్ధమవుతుందన్నారు. కాళేశ్వరం జలా లు ఆలేరుకు తీసుకువచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు 15 వ ప్యాకేజీలో నృసింహస్వామి జలాశయం నిర్మాణం జ రుగుతున్నదని పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ప్రధాన కాలువలో ఓటీ 1,2,3,5ల ద్వారా ఆలేరు ని యోజకవర్గంలోని ప్రతీ చెరువుకు గోదావరి జలాలు తీసుకురానున్నట్లు తెలిపారు. విడుతలవారీగా కాళేశ్వరం 15వ ఫ్యాకేజీలో భాగంగా నిర్మించే గంధమల్ల జలాయ శం నిర్మాణాలను పూర్తి చేసే బాధ్యత సీఎం కేసీఆర్ తీసు కున్నారన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులు, స్థా నిక ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లాలని రోడ్డుపై కూ ర్చోని నిరహార దీక్షలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేర న్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, మండల కో ఆర్డినేటర్ మాదవరెడ్డి, గౌరాయిపల్లి సర్పంచ్ సత్యానారాయణ, టీఆర్ఎస్ గ్రా మాధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ బైర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.