యాదాద్రి, జూలై5: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో సుమా రు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజ లు నిర్వహించారు. ప్రతిఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రిలో స్వామివారిని లక్ష పుష్పాల తో అర్చనలు చేయడం ఆలయ సంప్రదాయం.
రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వతవర్ధినీసమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంట నే భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నరపాటు శివుడి ని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడిని ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చకులు అర్చన చేశారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. .
స్వామివారి ఖజానాకు రూ. 16,55,203 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.16,55,203 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ.2,13,906 రూ.100 దర్శనంతో రూ. 64,000, వీఐపీ దర్శనాలతో రూ.1,09,500, నిత్యకైంకర్యాలతో రూ.2,516, సుప్రభాతంతో రూ.3,200, క్యా రీబ్యాగులతో రూ.5,500, సత్యనారాయణస్వామి వ్రతా లతో రూ.85,500, కల్యాణకట్టతో రూ.42,800, ప్రసా ద విక్రయంతో రూ.7,58,650, శాశ్వతపూజల ద్వారా రూ.9,116, వాహన పూజలతో రూ.19,700, టోల్గేట్తో రూ.100, అన్నదాన విరాళంతో 26,160, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,45,220, యాదరుషి నిలయంతో రూ.73,840, పాతగుట్టతో రూ.21,573, టెం కాయల విక్రయాలతో రూ.73, 020తో కలుపుకొని రూ. 16,55,203 ఆదా యం సమకూరినట్లు ఆమె తెలిపారు.
ఆర్జిత పూజల కోలాహలం
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.