ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ఆత్మకూరు(ఎం)లో మొక్క నాటుతున్న టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణాఉపేందర్రెడ్డి దంపతులు
మోత్కూరు, జూన్5: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొ క్కలను పెంచాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ నిర్వహణ సంస్థల జిల్లా కో-ఆర్డినేటర్ నీల యాకయ్య కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్స వాన్ని మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కొండాపురంలో శనివారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ నిర్వహణ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించి స్థానికులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో వలంటీర్లు సత్యనారాయణ, మధు, నరేశ్, మత్స్యగిరి, భాస్కర్, నవీన్, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
రామన్నపేట, జూన్5: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు బాలరాజుయాదవ్ అన్నారు. శనివారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ యాదయ్యతో కలిసి బాలరాజు మొక్కలను నాటా రు. కార్యక్రమంలో కళాశాల ఏవో భాస్కర్, విష్ణు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్,జూన్5: పర్యావరణాన్ని పరిరక్షించాలని టీఆర్ఎ స్ మండల కార్యదర్శి జనగాం వెంకట పాపిరెడ్డి అన్నారు. శనివా రం మండలంలోని కొల్లూరులో పర్యావరణ దినోత్సవం సంద ర్భంగా పలు వీధులలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు గాజుల మలికార్జున్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఆత్మకూరు(ఎం): పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్క లు నాటి సంరక్షించాలని టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ, రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం దశరథగౌడ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం తమ ఇంటి పరిసర ప్రాంతా ల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు నాటారు.