యాదాద్రి, ఏప్రిల్ 5: యాదాద్రి లక్ష్మీనరసింహుడి సంప్రదా య పూజలు అత్యంత వైభవంగా జరిపారు. సోమవారం వేకు వజామునే స్వామివారిని బాలాలయంలో కవచమూర్తులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో నిజాభిషేకం నిర్వహిం చారు. అనంతరం తులసీఅర్చనలు జరిపారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. లక్ష్మీనరసింహుడి బాలాల యంలో సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు పరి మిత సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం లక్ష్మీనరసింహులను అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొ ని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరి పారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్య నారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తు లు కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
యాదాద్రి లక్ష్మీ నరసిం హస్వామి కొండపై వేం చేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ని ర్వహించారు. యాదాద్రీ శుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు రుద్రాభిషేకం జరిపించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే పరమశివు డికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచా మృతాలతో శివలింగాన్ని అర్చించారు, విభూతి తో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు.
నేడు స్వామివారి హుండీ లెక్కింపు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి హుండీ లెక్కింపు మంగ ళవారం చేపట్టనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఉదయం 7 గంటలకు యాదాద్రి కొండపైన ఉన్న హరితభవన్లో లెక్కిం పు ప్రారంభించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
రూ. 5,39,482 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు రూ. 5,39, 482 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 20,342, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 3,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 6,450, సుప్రభాతం ద్వారా రూ. 1,400, ప్రచారశాఖ ద్వారా రూ. 300, క్యారీబ్యాగుల ద్వారా రూ. 1,979, వ్రతాల ద్వారా రూ. 13,500, కల్యాణకట్ట ద్వారా రూ. 13,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 2,37,050, వాహన పూజల ద్వారా రూ. 5,500, టోల్గేట్ ద్వారా రూ. 610, అన్నదాన విరాళం ద్వారా రూ. 3,632, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 32,608, యాదరుషి నిలయం ద్వారా రూ. 34,180, పాతగుట్ట ద్వారా రూ. 4.140, ఇతర విభాగాలు రూ.1,62,800తో కలిపి రూ.5,39,482 ఆదాయం లభించిందని ఆమె తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
రైతులను తప్పుదోవ పట్టించిన ప్రతిపక్షాలు
వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలి