మోటకొండూర్, రాజాపేట, జూలై 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం మోటకొండూర్, రాజాపేట మండలాల్లో ముమ్మరంగా కొన సాగుతున్నది. శుక్రవారం రెండో రోజు మండలాల్లోని అన్ని గ్రామాల్లో హరితహారం, రోడ్లు, మురికి కాల్వలను శుభ్ర పర చడం వంటి పనులు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో సర్పం చ్లు, అధికారులు, గ్రామాల ఇన్చార్జిలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
యాదగిరిగుట్ట రూరల్: పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వా ములవ్వాలని మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని పెద్దకందుకూరును సందర్శిం చి గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామంలో పల్లె ప్ర గతి పనులను పర్యవేక్షించారు. పల్లెప్రకృతివనం, వైకుంఠధా మం, నర్సరీలను పరిశీలించారు. అదేవిధంగా ఎంపీడీవో ప్ర భాకర్ రెడ్డి, ఎంపీవో చంద్రశేఖర్లు మండలంలోని పలు గ్రా మాల్లో జరుగుతున్న పనులు తీరును పర్యవేక్షించారు. కార్యక్ర మంలో సర్పంచ్ రాములుగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లెలు మెరువాలి
ఆలేరురూరల్: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెలు మెరు వాలని సర్పంచ్ పులుగం పద్మయాదిరెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని పటేల్గూడెంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల ప్రత్యే కాధికారి అనురాధ, తహసీల్దార్ గణేశ్నాయక్, ఎంపీడీవో జ్ఞానప్రకాశ్రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో
తుర్కపల్లి: పల్లె ప్రగతిలో భాగంగా రెండో రోజు మండల కేం ద్రంతో పాటు వాసాలమర్రి, చోక్లాతండా, తిరుమలాపురం, వీరారెడ్డిపల్లి, రుస్తాపురం తదితర గ్రామాల్లో ఇండ్ల మధ్య ఉన్న కలుపు మొక్కలను తొలగించారు. అదేవిధంగా ఆయా గ్రామా ల్లో రోడ్డుకు ఇరువైపులా కాలనీల్లో మొక్కలు నాటారు. గ్రామం లోని గుంతలను పూడ్చివేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉ మాదేవి, సర్పంచ్లు పోగుల ఆంజనేయులు, పడాల వనిత, భూక్యా సరిత, జక్కుల శ్రీవాణి, లావణ్య, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, బొరెడ్డి వనజ తదితరులు పాల్గొన్నారు.
మాలభివృద్ధి కోసమే పల్లె ప్రగతి
ఆత్మకూరు(ఎం): గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతిని ప్రవేశపెట్టిందని మండల ప్రత్యేకాధికారి శ్యామ్ సుంద ర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు ఉప్పలపహ డ్, పారుపల్లి, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లోచేపట్టిన వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులతో పాటు పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో రాములు, సర్పం చ్లు రమేశ్గౌడ్, సరిత, కార్యదర్శులు రాఘవేందర్, శ్రీనివాస్ తో పాటు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించా లని ఆత్మకూరు(ఎం) సర్పంచ్ జన్నాయికోడె నగేశ్ అన్నారు. శుక్రవారం పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని కంపోస్ట్ షెడ్ వద్ద, గ్రామంలోని వీధుల వెంట మొక్కలు నాటారు. కార్యక్ర మంలో ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ నవ్య, పంచాయతీ కా ర్యదర్శి శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు మల్లేశం పాల్గొన్నారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
బొమ్మలరామారం: గ్రామాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇ వ్వాలని ఎంపీడీవో సరిత అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం మండలం కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మొక్క లు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంపల్లి మహేశ్ గౌడ్, ఉపసర్పంచ్ జూపల్లి భరత్, ఎంపీటీసీ మైలారం ఈదమ్మ, జీ హెచ్ఎం ఉపేంద్ర, అంగన్వాడీ టీచర్లు కరుణ, తేజ, స్టాలిన్ బాబు,సీఆర్పీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.