మోటకొండూర్, ఏప్రిల్2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. అదే రీతిలో మండలంలోని చాడ గ్రామం కూడా గ్రామస్తులు, అధికారుల సహకారంతో అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటున్నది. గతంలో చాడ, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలు ఒకే గ్రామపంచాయతీగా ఉండేవి. సీఎం కేసీఆర్ కృషితో చాడ గ్రామం నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 2,237 మంది జనాభాతో 10 వార్డులు ఏర్పడ్డాయి. పురుషులు 1,082 మంది, స్త్రీలు 1,155 మంది, 650 ఇండ్లు ఉన్నాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో ఇప్పటికే రైతువేదిక, డంపింగ్యార్డు, వైకుంఠధామం పనులను పూర్తి చేశారు. గ్రామంలో రాత్రివేళల్లో విద్యుత్ లైట్ల వెలుగులు విరజిమ్ముతున్నాయి. డంపింగ్ యార్డు నిర్మాణంతో ప్రతిరోజూ తడి, పొడి చెత్తను సేకరిస్తుండటంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. సేకరించిన చెత్తను పంచాయతీ ట్రాక్టర్తో డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా 38 కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన 33ఇండ్లను తొలగించారు. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. నర్సరీలో 10 వేల మొక్కల పెంపునకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు.
గ్రామంలో పూర్తయిన నిర్మాణాలు
మండలంలోని కాటేపల్లి, ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్, కదిరేణిగూడెం, నాంచారిపేట గ్రామాలను కలిపి చాడ గ్రామాన్ని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. ఇప్పటికే గ్రామంలో రైతువేదిక పూర్తయింది. అదేవిధంగా డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణాలను పూర్తి చేశారు. ప్రభుత్వ విప్ దంపతుల సహకారంతో గ్రామంలో మహిళా సంఘం భవనం, పోస్టాఫీసు భవనం ఏర్పాటుకు సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.
పారిశుధ్య పనులు భేష్
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పారిశుధ్య పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పంచాయతీ సిబ్బంది పంచాయతీ ట్రాక్టర్తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పలు వార్డుల్లో మురుగునీటి నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు.
ఆహ్లాదకరంగా ప్రకృతివనం
అధికారుల నిరంతర పర్యవేక్షణతో గ్రామంలోని ప్రకృతివనం ఆహ్లాదకరంగా తయారైంది. ప్రకృతివనంలో 2,400 మొక్కలను, మధిర గ్రామమై న గడ్డగొల్లబావి ప్రకృతివనంలో 1500 మొక్కలను నాటారు. వాటికి ప్రతిరోజూ పంచాయతీ ట్యాంకర్తో నీటిని అందిస్తున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగి ప్రకృతివనాల్లో పచ్చదనం సంతరించుకుంది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ ఎట్టమ్మ నిరంతరం కృషి చేస్తున్నారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
అధికారులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నాం. అభివృద్ధే లక్ష్యం గా నిరంతరం పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆరు గ్రామ పంచాయతీలతో కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి మా గ్రామంలో రైతు వేదికను నిర్మించుకోవడం సంతోషంగా ఉంది.
-మల్గ ఎట్టమ్మ, చాడ సర్పంచ్
ఇవీ కూడా చదవండి..
రేప్ ఆరోపణలు.. ఇద్దరు మంత్రులపై వేటు
వ్యాక్సిన్ తీసుకున్న పుతిన్కు సైడ్ ఎఫెక్ట్స్
తేడాలు మరచి కలిసి సాగుదాం : కమలా హారిస్ హోలీ సందేశం
చైనాలో చిక్కుకున్న ‘ఎవర్ గివెన్’ ట్రాలీ.. నిలిచిన ట్రాఫిక్
పల్మాపై మిలిటెంట్ల దాడి.. డజన్ల సంఖ్యలో మృతులు
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో