చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 2: వాహనదారులపై అదనపు భారం పడింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి జేబులు ఖాళీ కానున్నాయి. టోల్చార్జీలు పెంచుతూ ఎన్హెచ్ఏఐ తీనుకున్న నిర్ణయం తెలిసిందే. మార్చి 31 నుంచి ధరలు అమల్లోకి వచ్చాయి. ఏడాది పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి. ధరలు పెరగడంతో జిల్లాలోని పంతంగి టోల్ప్లాజా వద్ద గత బుధవారం అర్ధరాత్రి నుంచే రుసుం వసూలు చేస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇరువైపులా కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.25వరకు పెంచారు. ప్రతినెలా పాస్కు కనిష్ఠంగా రూ.90 నుంచి గరిష్ఠంగా రూ.590 వరకు లోకల్ పాసుకు రూ.10 వరకు పెంచారు.ఈ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిలో నిర్మించారు. దీంతో ప్రతియేటా పెంచే వెసులుబాటు ఉంది. దీంతో ఎన్హెచ్ఏఐ ఆమోదంతోనే ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని చోట్ల గుత్తేదారి సంస్థ ఒప్పందం ప్రకారం సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో చేయలేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సిగ్నల్స్ వద్ద లైటింగ్ సమస్య ఉందని చెబుతున్నారు.
చార్జీలు పెంచడం భారంగా ఉంది
ప్రతిసారి టోల్చార్జీలు పెంచడం వాహనదారులకు భారంగా ఉంది. ఇప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సతమతమవుతున్నాం. ధరల పెరుగుదలతో చిన్న చిన్న పనులకు సొంత వాహనాల్లో వెళ్లలేకపోతున్నాం. అత్యవసర పరిస్థితులోనే కారు బయటకు తీయాల్సి వస్తున్నది. టోల్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది.
-జాల మల్లేశంయాదవ్, వాహనదారుడు
చార్జీల పెంపు ఎన్హెచ్ఏఐ నిర్ణయం
ప్రతిఏటా టోల్చార్జీల పెరుగుదల ఎన్హెచ్ఏఐ నిర్ణయం. రహదారిని బీవోటీ పద్ధతిలో నిర్మించారు. దీంతో సంస్థకు ప్రతి ఏటా పెంచే వెసులుబాటు ఉంది.మరమ్మతుల విషయంలో రహదారిపై కొన్ని తక్షణమే చేయాల్సినవి, మరికొన్ని పనులకు అధిక సమయం పడుతోంది. దీర్ఘకాలిక పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. మిగతావి తక్షణమే పూర్తిచేస్తున్నాం.
-శ్రీధర్రెడ్డి, జీఎమ్మార్ మేనేజర్
ఇవీ కూడా చదవండి..
ఆశ్రయం ఇవ్వొద్దు.. ఆదేశాలు వెనక్కి
పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వికి కరోనా