భువనగిరి అర్బన్: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని రాయగిరి సమీపంలోగల సహృదయ అనాథ వృద్ధులకు కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ ఆదివారం పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనాథ వృద్ధ్దాశ్రమంలో నివాసం ఉంటున్న 19 మం ది వృద్ధుల యోగక్షేమాలు, రక్షణ సంరక్షణ చర్యలను కలెక్టర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
వృద్ధులతో కలెక్టర్ మాట్లాడి యోగక్షేమాలు, ఆరోగ్య స్థితిగతులను స్వయంగా తెలుసుకోవడంతో వృద్ధులు సంతృప్తి చెందారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అనాధ వృద్దులకు భోజన సదుపాయం కల్పించిండంతో వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో చైతన్యజైనీ, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి, బాలల సంరక్షణ అధికారి సైదులు, ఎక్సైజ్ శాఖ అధికారి కృష్ణప్రియ పాల్గొన్నారు.