యాదాద్రి: మహేంద్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్ యాదవ్కు వనమాలి అవార్డు వరించింది. గత నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సతీశ్యాదవ్ పాల్గొని యాదగిరిగుట్ట పట్టణంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యాప్తో అప్లోడ్ చేయగా హరిత సంకల్పంలో కృషిని గుర్తిస్తూ మంత్రి కేటీఆర్ వనమాలి అవార్డును మెయిల్ ద్వారా అందజేశారు.