యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి బాలాలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశా రు. అనంతరం కేంద్రమంత్రి కిషన్రెడ్డి యాదా ద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
పూర్తి కృష్ణశిలలతో నిర్మితమైన ప్రధానాలయ పురవీధులు, బ్రహ్మోత్సవ మంపడంతోపాటు ఆలయ మాడవీధులు, యాలీ పిల్లర్లు, గర్భాలయంలోని నిర్మాణాలను పరిశీలించారు. సుమారు 20 నిమిషాలపాటు ఆలయ నిర్మాణాలను పరిశీలించిన కేంద్రమంత్రికి నిర్మాణాల తీరును వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి వివరించా రు. కిషన్రెడ్డికి ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటానికి బహూకరించారు. ఆయన వెంట ఆలయ ఈవో ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకులు మోహనాచార్యులు, అర్చకులు రంగాచార్యులు, ఆలయ ఏఈవోలు గజవెల్లి రమేశ్బాబు, శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.