మోత్కూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. బుధవారం మోత్కూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన మోత్కూరు, గుండాల మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నాయకత్వంలో ఏడేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామ, బూత్, మండల స్థాయిలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి పాటు పడాలన్నారు. ఈ నెల 2నడిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పార్టీ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో పార్టీ జెండా పండుగ నిర్వహించాలన్నారు. నూతన కమిటీల్లో 51 శాతం ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉన్న వారిని మాత్రమే కమిటీల్లో తీసుకోవాల న్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్, కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, రైతు సహకార సంఘం చైర్మన్లు కంచర్ల అశోక్రెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొండ సోంమల్లు, ఎంపీపీ అంజయ్య, వైస్ ఎంపీపీలు బుషిపాక లక్ష్మి, పురషోత్ంత, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు గుండిగ జోసఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, పేలపుడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.