బొమ్మల రామారం : తీవ్ర అస్వస్తకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పుర కృష్ణగౌడ్(58) తన కుటుంబంతో సహా హైదరాబాద్లోని నాచారంలో నివసిస్తున్నాడు. తన స్వగ్రామంలో సాగు చేస్తున్న భూమి వద్దకు తరుచుగా వచ్చి వెళ్లేవాడు.
గురువారం తన పొలానికి వెళ్లి వస్తుండగా అస్వస్తకు గురి కాగా స్థానికంగా ఉన్న ప్రజా నర్సింగ్ హోమ్లో బీపీ చెక్ చేయించుకొన్నాడు. బీపీ ఎక్కువగా ఉందని తేలడంతో చికిత్స కోసం హైదరాబాదుకు వెలుతుండగా ఆసుపత్రి బయటకు రాగనే అక్కడికక్కడే పడి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.