గుండాల : మండలంలోని ఆదర్శ పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి శనివారం జరి గిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. గుండాల ఆదర్శ స్కూల్లో 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీలుండగా 69 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 58 మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరయ్యారు. 7వ తరగతిలో 2 సీట్లకు 10 మంది దరఖాస్తు చేసుకుని 8మంది హాజరు కాగా.. 8వ తరగతిలో 2 సీట్లకు ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ముగ్గురు హాజరయ్యారు. 9వ తరగతిలో 1సీటు ఉండగా ముగ్గురు దరఖాస్తు చేసుకుని ఇద్దరు పరీక్షకు హాజరయ్యా రు. టెన్త్లో ప్రవేశం కోసం ముగ్గురు విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆదర్శ స్కూల్ ప్రిన్సిపాల్ సురేశ్కుమార్ తెలిపారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం, ఆగస్టు21: మండలంలోని ఆద ర్శ పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి శనివారం జరిగిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఆరోతరగతిలో ప్రవేశానికి 61మంది ,7, 8, 9,10 తరగతులకు 62 మంది దరఖాస్తు చేసుకోగా, 6వతరగతి ప్రవేశ పరీక్షకు 44 మంది.. 7నుంచి10తరగతులకు 48 మం ది హాజరైనట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమం లో జీహెచ్ఎం ఉపేంద్ర, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, ఉపాధ్యాయులు రవిబాబు, కేదార్నాథ్, శ్రీనయ్య, మాధవీలత, ప్రజాతరాణి పాల్గొన్నారు.