రామన్నపేట: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఇంద్రపాలనగరం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జీవనోపాధి కోసం సచిన్ తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు అన్షు (3సంవత్సరాలు), అహున్షిక (6నెలలు) తో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇంద్రపాలనగరం గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ పానీపూరి బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు .
శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఛాట్ బండార్ కోసం ఇంట్లో పిండి పదార్దాలు చేస్తున్నారు. కాగా అదే సమయంలో ఇంట్లో అన్షు కనిపించకపోవడంతో తండ్రి సచిన్ ఇంటి బయట వెతికినా జాడ కనిపించలేదు. ఇంట్లో సంపు పరిసరాల్లో వెతుకుతుండగా నీటి సంపులో పడి ఉండటంతో వెంటనే బయటికి తీసీ రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.