యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమాధికారి సోని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతిగృహం నుంచి గోశాల, యాదగిరిపల్లి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థినులు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందన్నారు.
దాదాపు మూడుకిలో మీటర్ల దూరం వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జిల్లా సంక్షేమాధికారి జయపాల్రెడ్డి, యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి, ట్రాఫిక్ సీఐ సైదులు దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించి ఆర్టీసీ బస్సును అందుబాటులోకి తీసువచ్చారని ఆమె పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం పాఠశాల సమయంలో ఈ బస్సు నడుస్తుందని, ఈ సందర్భంగా బస్సు సౌకర్యం కోసం సహకరించిన అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.