రామన్నపేట: దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులను పరిశీలించారు. కాన్పుల వార్డును పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, దవాఖాన సిబ్బందికి అందుబాటులో ఉన్న వసతుల ను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి సేవలు అందించాలన్నారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రి య గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేష న్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. దవాఖానలో పారిశుధ్యం, ఆవరణలో ఉన్న చెత్త, పిచ్చిమొక్కలను చూసి అస హానం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి, డిప్యూటీ తహాసీల్దార్ ఇబ్రహీం, మండల వైద్యాధికారి రవి కుమార్, డాక్టర్ పురుషోత్తం రాజు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.