భువనగిరి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని పలు మండలాల నుంచి ఆర్జీదారులు వినతులను సమర్పించేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి ఆర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహించొద్దన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి ఆర్జీదారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా 57 ధరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.