ఆత్మకూరు(ఎం): సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన దళితబంధును విమర్శించే రాజకీయ పార్టీల కు రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్య మంత్రి కేసీఆర్ దళితబంధు పథకా న్ని ప్రవేశపెట్టి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం హర్షణీయమన్నారు.
మొదటగా ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో అర్హులైన దళిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రూ.10 లక్షల చెక్కులను అందజేయడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దళిత కుటుం బాలన్నింటికీ దళితబంధును అందించే విధంగా ప్రభు త్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి గారు రాజీనామా కాదు.. అభివృద్ధి చేసి చూపించు
ప్రజల ఓట్లతో స్వల్ప మోజార్టీతో గెలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని బెదిరించడం కాదు నీ నియోజక వర్గ పరిధిలోని గ్రామా ల్లో అభివృద్ధి చేసి చూపించాలని ప్రభుత్వ విప్ సునీ తారెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భ్రమలో పడిన ఎం పీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆ ర్, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే టీఆర్ఎస్ సైనికులు తరిమి కొడతారని అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను పొందిన లబ్ధిదారులు అందరూ ఏకమై టీఆర్ఎస్కు ఓట్లు వేస్తే ఏ పార్టీ అభ్యర్ధులు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. సమావేశంలో ఆత్మకూరు(ఎం), యాదగిరిగుట్ట మండలాల టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య, కర్రె వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి పంజాల వెంకటేశ్గౌడ్, జిల్లా నాయకులు ఇంద్రారెడ్డి, భిక్షపతి, చందర్గౌడ్, భానుప్రకాశ్ , ఎంపీటీసీ కవిత, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు లగ్గాని రమేశ్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం ధశరథగౌడ్, మల్లేశ్, రాజు, శేఖర్, సాయిలు పాల్గొన్నారు.