భువనగిరి కలెక్టరేట్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాను కోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలు పు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడు తున్నారని అన్నారు.
కరోనాతో దేశంలో 10లక్షల మంది చనిపోతే వ్యాక్సినేషన్ పక్రియకు నిధులు కేటాయించడానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. వ్యవ సాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసే విధంగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయా లన్నారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, భట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.