రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపు రేఖలు మారిపోతున్నాయి. పల్లెల్లో మౌలిక సమస్యలు తీరు తుండడంతో అవి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయి.
పల్లె ప్రగతిలో మంజూరైన నిధులను పాలకులు సక్రమంగా వినియోగించుకోవడంతో గ్రామంలో వైకుంఠ ధామం, డంపింగ్యార్డు, పల్లె పకృతి వనం, అంతర్గత మరుదొడ్లు, ప్రతి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో అభివృద్ధిలో పలు గ్రామాలతో పోటీ పడుతూ మరికొన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది పాముకుంట గ్రామం.
మండలంలోని పాముకుంటలో 2024 మంది జనాభా ఉండగా 1550మంది ఓటర్లు ఉన్నారు. గ్రామాభి వృద్ధి కోసం పల్లె ప్రగతిలో భాగంగా మంజూరైన నిధులను గ్రామ సర్పంచ్ చిందం నర్సమ్మ సక్రమంగా విని యోగించడంతో గ్రామం అన్ని రంగాల్లో ముందజలో ఉంది. గ్రామంలో సుమారు రూ. 20 లక్షలతో అం తర్గత మురికి కాలువలు, రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 22 లక్షలతో రైతు వేదిక, రూ 1.50 లక్షలతో డంపింగ్యార్డు నిర్మాణాలు చేపట్టారు.
గ్రామ పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తూ గ్రామంలో స్వచ్ఛతకు పాటు పడుతున్నారు. గ్రామ శివారులో పల్లె పకృతి వనంలో తీరొక్క మొక్క లు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామానికి వచ్చే రోడ్లకు ఇరువైపులా 12 వందల మొక్కలు నాటడంతో ఆవి ఏపు గా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.