ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని పుల్లాయిగూడెం ప్రగతి పథంలో ముందుకు పోతుంది. గ్రామంలో మొత్తం 790 మంది జనాభా కలిగి ఉండగా 545 మంది ఓటర్లకు గాను 176 ఇండ్లు ఉన్నాయి.
గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.21లక్షలతో ప్రజలందరి అవసరాల కోసం గ్రామంలో రూ.12లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల50వేలతో కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులు చేపట్టగా, రూ.90వేలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి రూ.5లక్షలతో సీసీరోడ్లు నిర్మించారు.
పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం..
ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల వెంట 2,500ల మొక్కలను నాటగా ఇంటిం టికీ 1100ల మొక్కలు పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వ ర్యంలో ట్రీ గార్డులను ఏర్పాటు చేసి ప్రతిరోజూ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకు
ద్వారా నీళ్లను పట్టడంతో నేడు నాటిన ప్రతి మొక్క వేపుగా పెరగడంతో పచ్చదనం సంతరించుకుంది. పరిశుభ్రతలో భాగంగా ప్రతి రోజూ ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్కు తరలించడంతో గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రంగా కనబడుతుంది.