ప్రభుత్వ పాఠశాలల్లో ‘హరివిల్లు’ పాఠాలు
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు కృషి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో శిక్షణ
భువనగిరి టౌన్/ఆలేరు టౌన్, మే 1 : సర్కారు బడుల బలోపేతం దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందులో భాగంగా ఢిల్లీ, జార్ఖండ్ రాష్ర్టాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘సంతోష విద్య’ తరహాలో రా ష్ట్రంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేం దుకు ‘హరివిల్లు’ కార్యక్రమాన్ని రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరం దీనిని అమలు చేయాలని నిర్ణయిం చిం ది. తద్వారా ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు వారిలో నైపుణ్యాలు పెరగను న్నాయి. దీని కోసం ఇప్పటికే జిల్లాకు చెందిన 34మంది రిసోర్స్ పర్సన్లు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారు ఈ నెల 3 నుంచి జిల్లాలోని 481 ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాలల్లో పనిచేస్తున్న 1402 మంది ఉపాధ్యాయు లకు శిక్షణ ఇవ్వనున్నారు.
‘హరివిల్లు’ కార్యక్రమం
చిన్నారుల్లో నైతిక విలువలు, ప్రేమ, వాత్సల్యం, గౌరవం, ఐక్యత, నమ్మకం, నిజాయతీ, కృతజ్ఞత వంటి అంశాలతో పాటు ఆటలు, పాటలతో కూడిన ఉల్లాసవంతమైన బోధన ను అందించడం ద్వారా నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వం ‘హరివిల్లు’ కార్యక్రమాన్ని రూపొందించిం ది. ఇందులో భాగంగా ప్రతిరోజూ మొదటి 30 నిమిషాల పాటు మానసిక సంసిద్ధత, కథలు, సమన్వయ కృత్యాలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాలను బోధిస్తారు. అంతేకాకుం డా చిన్నారుల్లో ఏకాగ్రత పెంచడం, మానసికంగా సిద్ధం చేయడం, వ్యాయామాలు, కథలు, ఆటలు, నాయకత్వ లక్షణాలు, భాషా విజ్ఞానం పెంపొందించేలా కార్యక్రమా లుంటాయి. ఒకటో, రెండో తరగతుల విద్యార్థులను ఒక టవ స్థాయిగానూ, 3వ, 4వ, 5వ తరగతుల విద్యార్థులను రెండో స్థాయిగా గుర్తించి ప్రత్యేక పద్ధతుల ద్వారా బోధన చేయనున్నారు. ‘హరివిల్లు’ కార్యక్రమంతో ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాలల్లో బోధన తీరు పూర్తిగా మారనుంది. తద్వా రా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు బలోపేతం కానున్నాయి. కాగా జిల్లాలో 712 ప్రభు త్వ పాఠశాలలుండగా ఇందులో 481 ప్రాథమిక పాఠశాల లున్నాయి. ఇందులో ప్రస్తుతం 16570 మంది చిన్నారు లు విద్యనభ్యసిస్తుండగా, వీరికి 1402 మంది ఉపాధ్యా యులు బోధన చేస్తున్నారు.
3 నుంచి శిక్షణ ప్రారంభం
‘హరివిల్లు’ కార్యక్రమాన్ని పకడ్భంధీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా జిల్లా లోని 481 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 1402 మం ది ఉపాధ్యాయులకు జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాకు చెందిన 34 మంది రిసోర్స్ పర్సన్లకు శిక్షణనిచ్చిం ది. వీరు ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు మూడు సెషన్ల లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి సెషన్ లో భువనగిరి, యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి మండ లాలకు ఉపాధ్యాయులకు, రెండో సెషన్లో ఆలేరు, బోమ్మ లరామారం, మోటకొండూరు, ఆత్మకూర్, గుండాల, అడ్డ గూడూరు, మోత్కూరు, వలిగొండ, మూడో సెష న్లో చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి, బీబీనగర్, రామ న్నపేట మండలాల ఉపాధ్యా యులకు శిక్షణ ఇవ్వనున్నారు.