న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.310 పెరిగి రూ.46,580కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,270 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరుగడమే దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.580 పెరిగి రూ.67,429కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,849 వద్ద ముగిసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,777 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.06 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
పవన్ సరసన టాలెంటెడ్ నటి..!
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!