తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మండలం ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల పరిధిలోని తొండ గ్రామంలో ఎంపీపీ స్నేహలత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధుతో దళిత సమాజానికి దిక్సూచిగా మారారని, అట్టడు గున ఉన్న దళితులకు దళితబంధుతో వారి ఆత్మగౌరవం పెంచారన్నారు. తిరుమలగిరి మండలంలోని 2500 దళిత కుటుంబాల్లో ఈ పథకం వెలుగులు నింపనుందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధం గా ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు.
పార్టీలు, కులాలు మతాలకు అతీ తంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అభి నవ అంబేద్కర్గా సీఎం దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు దళితుల గురించి ఇంతగా ఆలోచన చేయలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్ రెడ్డి, గొలుసుల మల్లయ్య, ఎర్రగొల్ల లింగన్న, దళిత నాయకులు పాల్గొన్నారు.